ETV Bharat / crime

బైక్ కారు ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : Jan 24, 2021, 2:46 PM IST

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బేగంపేట పీ అండ్ టీ ఫ్లై ఓవర్ వద్ద జరిగింది.

car bike accident in begumpeta area and one person died
బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి

వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్రైవర్​ ప్రసాద్ రావు నిర్లక్ష్యం కారణంగా.. నాచారానికి చెందిన అక్బర్ ఖాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మెక్​డొమినోస్​లో విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి నాచారానికి వెళ్తున్న క్రమంలో బేగంపేట పీ అండ్ టీ ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అక్బర్ ఖాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్రైవర్​ ప్రసాద్ రావు నిర్లక్ష్యం కారణంగా.. నాచారానికి చెందిన అక్బర్ ఖాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మెక్​డొమినోస్​లో విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి నాచారానికి వెళ్తున్న క్రమంలో బేగంపేట పీ అండ్ టీ ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అక్బర్ ఖాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: బాలికపై సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.