సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలితో పాటు మరో మహిళను వేగంగా ఢీ కొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికురాలు సత్యమ్మ, రోడ్డుపై ఉన్న విట్టమ్మ అక్కడికక్కడే మృతిచెందారు.
స్థానికంగా ఉన్న నాలుగు దుకాణాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనకు కారణమైన బొలెరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కూలిన నాలుగంతస్తుల భవనం గోడ.. ఒకరు మృతి