సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలో వ్యవసాయ బావులకు వెళ్లే ఎల్టీ విద్యుత్ తీగలు తెగి 7 పశువులు మృతి చెందాయి. వాటిలో 6 గేదెలు, ఒక ఎద్దు ఉన్నాయి. పది రోజుల కిందట ఇదే మండలంలోని జల్మల్కుంట తండాలో 5 పశువులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి.
మండల కేంద్రం నుంచి దుబ్బతండాకు వెళ్లే దారిలో ఉన్న ఎస్ఎస్9- 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ లైన్.. షార్ట్ సర్క్యూట్తో తెగి కిందపడింది. మేత కోసం వెళ్లిన పశువులకు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాయి. ఆరుగురు రైతులకు చెందిన ఈ పశువులు మృతి చెందడంతో సుమారు. 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. రైతులకు జరిగిన నష్టానికి విద్యుత్ అధికారులు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మూడో దశ వ్యాక్సినేషన్కు సిద్ధమవుతున్న ప్రభుత్వం