ETV Bharat / crime

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు

author img

By

Published : Oct 13, 2022, 4:32 PM IST

Updated : Oct 13, 2022, 5:18 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు

16:31 October 13

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. మరో రెండు రోజుల పాటు విచారించేందుకు సీబీఐ అనుమతి కోరగా.. కోర్టు అనుమతినిచ్చింది. ఇదే వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందన్న దర్యాప్తు సంస్థ.. ఇదే కేసులో ముత్తా గౌతమ్​ను విచారణ చేస్తున్నామని వివరించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైకి గౌతమ్​తో ఉన్న సంబంధాలపై విచారించేందుకు రెండు రోజుల కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసింది.

అయితే ఈ కేసులో ఇంకా కస్టడీ అవసరం లేదని అభిషేక్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గడిచిన రెండు రోజులుగా కస్టడీ పేరుతో విచారణ ఏమీ చేయలేదని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. అభిషేక్ బోయినపల్లిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.

ఇదివరకే 3 రోజుల రిమాండ్..: దిల్లీ మద్యం కుంభకోణంలో మూడు రోజుల క్రితం అరెస్టయిన అభిషేక్ బోయిన్‌పల్లిని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచింది. అభిషేక్ బోయినపల్లిని ఐదు రోజుల రిమాండ్‌ ఇవ్వాలని కోరగా... సీబీఐ కోర్టు మూడు రోజుల రిమాండ్ ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లిపై ఇండోస్పిరిట్ ఖాతాల నుంచి రూ.3.85 కోట్లు అభిషేక్ ఖాతాలో చేరాయని ఆరోపణలు వచ్చాయి. నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని సీబీఐ ఆరోపించింది. 2-3 ఖాతాల ద్వారా అభిషేక్ ఖాతాలోకి నిధులు వచ్చాయని సీబీఐ పేర్కొంది. డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి షేర్లు కొన్నారని సీబీఐ వెల్లడించింది.

ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో సైతం..: ఇప్పటికే ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్‌ నాయర్‌ తర్వాత హైదరాబాద్​కు చెందిన అభిషేక్‌ బోయినపల్లిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. అయితే అభిషేక్ బోయిన్‌పల్లిని ఎక్కడ అరెస్టు చేశారు.. అనే విషయాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ 15మందిని నిందితులుగా పేర్కొంటూ.. మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనంతరం పలు మార్లు దిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి వ్యక్తులను ప్రశ్నించింది. మరికొందరిని దిల్లీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.

ఇవీ చూడండి..

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. అభిషేక్ అరెస్టు.. నెక్ట్స్ ఆ ప్రముఖులకే నోటీసులు!

Delhi liquor scam: అభిషేక్ బోయినపల్లికి 3రోజుల రిమాండ్.. ఇక నెక్ట్స్‌ వారే!

16:31 October 13

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. మరో రెండు రోజుల పాటు విచారించేందుకు సీబీఐ అనుమతి కోరగా.. కోర్టు అనుమతినిచ్చింది. ఇదే వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందన్న దర్యాప్తు సంస్థ.. ఇదే కేసులో ముత్తా గౌతమ్​ను విచారణ చేస్తున్నామని వివరించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైకి గౌతమ్​తో ఉన్న సంబంధాలపై విచారించేందుకు రెండు రోజుల కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసింది.

అయితే ఈ కేసులో ఇంకా కస్టడీ అవసరం లేదని అభిషేక్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గడిచిన రెండు రోజులుగా కస్టడీ పేరుతో విచారణ ఏమీ చేయలేదని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. అభిషేక్ బోయినపల్లిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.

ఇదివరకే 3 రోజుల రిమాండ్..: దిల్లీ మద్యం కుంభకోణంలో మూడు రోజుల క్రితం అరెస్టయిన అభిషేక్ బోయిన్‌పల్లిని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచింది. అభిషేక్ బోయినపల్లిని ఐదు రోజుల రిమాండ్‌ ఇవ్వాలని కోరగా... సీబీఐ కోర్టు మూడు రోజుల రిమాండ్ ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లిపై ఇండోస్పిరిట్ ఖాతాల నుంచి రూ.3.85 కోట్లు అభిషేక్ ఖాతాలో చేరాయని ఆరోపణలు వచ్చాయి. నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని సీబీఐ ఆరోపించింది. 2-3 ఖాతాల ద్వారా అభిషేక్ ఖాతాలోకి నిధులు వచ్చాయని సీబీఐ పేర్కొంది. డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి షేర్లు కొన్నారని సీబీఐ వెల్లడించింది.

ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో సైతం..: ఇప్పటికే ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్‌ నాయర్‌ తర్వాత హైదరాబాద్​కు చెందిన అభిషేక్‌ బోయినపల్లిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. అయితే అభిషేక్ బోయిన్‌పల్లిని ఎక్కడ అరెస్టు చేశారు.. అనే విషయాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ 15మందిని నిందితులుగా పేర్కొంటూ.. మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనంతరం పలు మార్లు దిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి వ్యక్తులను ప్రశ్నించింది. మరికొందరిని దిల్లీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.

ఇవీ చూడండి..

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. అభిషేక్ అరెస్టు.. నెక్ట్స్ ఆ ప్రముఖులకే నోటీసులు!

Delhi liquor scam: అభిషేక్ బోయినపల్లికి 3రోజుల రిమాండ్.. ఇక నెక్ట్స్‌ వారే!

Last Updated : Oct 13, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.