రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఓ యువకుడు విగతజీవిగా మారాడు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక జయశంకర్ కాలనీకి చెందిన అరుణ్ కుమార్(25) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని నందమూరినగర్కు తరలించారు.
స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. ఆత్మహత్యలకు గల కారణాలపై కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఘటనా స్థలం నుంచి మృతదేహం తరలించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.