ETV Bharat / crime

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బంగారం కోసం ప్రాణం తీశాడు

author img

By

Published : Apr 12, 2022, 12:16 PM IST

WIFE KILLED BY HUSBAND: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్య జీవితానికి గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంతలోనే మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి ఎంతలా అంటే.. మనసిచ్చి మనువాడిన భార్యనే అంతమొందించేంతలా. కనికరం లేకుండా ఆలి ఉసురు తీసేంతలా..

Couple
దంపతులు

WIFE KILLED BY HUSBAND: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసిన భర్తే భార్యను కడతేర్చాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్​కు చెందిన సుందరగిరి రాజేష్ సెల్ ఫోన్ షాపు నిర్వహించేవాడు. భార్య రక్షిత మధ్య బంగారు నగల తాకట్టు విషయంలో గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

తనకు తెలియకుండా బంగారు నగలు అమ్మడంతో రక్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సహనం కోల్పోయిన రాజేష్ సోమవారం ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం రామగుండం ఎన్టీపీసీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

WIFE KILLED BY HUSBAND: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసిన భర్తే భార్యను కడతేర్చాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్​కు చెందిన సుందరగిరి రాజేష్ సెల్ ఫోన్ షాపు నిర్వహించేవాడు. భార్య రక్షిత మధ్య బంగారు నగల తాకట్టు విషయంలో గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

తనకు తెలియకుండా బంగారు నగలు అమ్మడంతో రక్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సహనం కోల్పోయిన రాజేష్ సోమవారం ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం రామగుండం ఎన్టీపీసీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: CYBER FRAUD: రెండోసారి ఓటీపీయా.. ఓసారి ఆగండి.. ఆగండి..

మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్​రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.