A little boy died after the wall collapsed in the Kachiguda: గోల్నాక డివిజన్లోని నింబోలి అడ్డు ప్రాంతంలో కాచిగూడకు చెందిన సతేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా పక్కన ఉన్న గోడ కూలిపోయింది. అదే సమయంలో గోడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపై ఆ గోడ పడింది. దీంతో వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన దీరాసింగ్కి 6 సంవత్సరాలు, గాయాలు తగిలిన రాధికకు 5 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
![గాయాలు తగిలిన రాధిక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17272174_girl.jpg)
ఈ పిల్లలు ఇద్దరు రాజస్థాన్కి చెందిన వారిగా గుర్తించారు. రాజస్థాన్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి కుటుంబానికి ఇలా జరగడం బాధాకరమని, ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకొంటామని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: