ETV Bharat / crime

గుంటూరు జిల్లాలో ఆగివున్న డీసీఎంను ఢీకొన్న కారు, నలుగురు మృతి

author img

By

Published : Aug 15, 2022, 8:14 PM IST

Accident in Guntur district గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురిని బలితీసుకుంది. రోడ్డుపై నిలిచిన డీసీఎంను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

district
district

Accident in Guntur district: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. 108 వాహనంలో జీజీహెచ్​కు తరలించారు.

ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

Accident in Guntur district: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. 108 వాహనంలో జీజీహెచ్​కు తరలించారు.

ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.