ETV Bharat / crime

పిడుగు పాటుకు గురై గొర్రెలు మృతి.. రూ.1 లక్షకు పైగా నష్టం

author img

By

Published : Jun 24, 2021, 11:46 AM IST

ములుగు జిల్లా వాజేడు మండలంలో బుధవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పేరూరు గ్రామ శివారులో పిడుగు పడడంతో 10 గొర్రెలు మత్యువాతపడ్డాయి.

10 sheep dead with the Thunder effect
పిడుగుపాటుతో 10 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు గురై 10 గొర్రెలు మృతిచెందిన ఘటన... ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో చోటుచేసుకుంది. పేరూరు గ్రామానికి చెందిన యాదడ్ల సమ్మయ్య అనే వ్యక్తి బుధవారం గ్రామ శివారులో తన గొర్రెలను మేపుతున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో పాటు గొర్రెల సమీపంలో పిడుగు పడింది.

ఈ క్రమంలో అక్కడికక్కడే 10 గొర్రెలు మృతిచెందినట్లు బాధితుడు సమ్మయ్య తెలిపారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అన్నారు. తనకు నష్టపరిహారం అందించి... ప్రభుత్వం అదుకోవాలని కోరారు.

పిడుగుపాటుకు గురై 10 గొర్రెలు మృతిచెందిన ఘటన... ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో చోటుచేసుకుంది. పేరూరు గ్రామానికి చెందిన యాదడ్ల సమ్మయ్య అనే వ్యక్తి బుధవారం గ్రామ శివారులో తన గొర్రెలను మేపుతున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో పాటు గొర్రెల సమీపంలో పిడుగు పడింది.

ఈ క్రమంలో అక్కడికక్కడే 10 గొర్రెలు మృతిచెందినట్లు బాధితుడు సమ్మయ్య తెలిపారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అన్నారు. తనకు నష్టపరిహారం అందించి... ప్రభుత్వం అదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: Corona: మరో 54వేల కేసులు.. 1,321 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.