ETV Bharat / city

ఉచితంగా రెండు లక్షల మాస్క్​ల పంపిణీ

author img

By

Published : Apr 8, 2020, 4:04 PM IST

వరంగల్​ నగరానికి విస్తరించిన కరోనా మహమ్మారి నగరవాసులను కలవర పెడుతోంది. కరోనా వైరస్ సామూహికంగా కట్టడి చేసేందుకు అనేక సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లో నగరంలోని వివిధ సంస్థలు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు.

moksharamam foundation
ఉచితంగా రెండు లక్షల మాస్క్​ల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు, నిరుపేదలకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తోచిన విధంగా సయమందిస్తున్నాయి. మోక్షారామం స్వచ్ఛంద సంస్థ రెండు లక్షల మాస్క్​లను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా ఫౌండేషన్ సభ్యులతో మాస్క్​లను తయారు చేస్తూ అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ మంచి పనిలో మహిళలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.

పోలీసు, విద్యుత్ శాఖ పాటు నగరపాలక సంస్థ, ఆరోగ్యశాఖకు మాస్క్​లను వితరణ చేస్తున్నారు. మాస్క్​లతో పాటు పోలీస్ సిబ్బంది, వైద్యులు, వలస కూలీలు, యాచకులకు, నిరుపేదలకు భోజనాన్ని అందిస్తున్నామని మోక్షారామం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ వివరించారు.

లాక్​డౌన్​ సాగినన్ని రోజులు తమ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో రోజుకు 300 మంది ఆకలిని తీరుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు వెయ్యి మందికి భోజనం పెట్టడమే తమ లక్ష్యమన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

మోక్షారామం ఫౌండేషన్


ఇవీ చూడండి: మాస్క్‌ మళ్లీ మళ్లీ వాడేలా.. లామినేట్‌ షీట్‌తో ప్రయోగం

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు, నిరుపేదలకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తోచిన విధంగా సయమందిస్తున్నాయి. మోక్షారామం స్వచ్ఛంద సంస్థ రెండు లక్షల మాస్క్​లను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా ఫౌండేషన్ సభ్యులతో మాస్క్​లను తయారు చేస్తూ అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ మంచి పనిలో మహిళలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.

పోలీసు, విద్యుత్ శాఖ పాటు నగరపాలక సంస్థ, ఆరోగ్యశాఖకు మాస్క్​లను వితరణ చేస్తున్నారు. మాస్క్​లతో పాటు పోలీస్ సిబ్బంది, వైద్యులు, వలస కూలీలు, యాచకులకు, నిరుపేదలకు భోజనాన్ని అందిస్తున్నామని మోక్షారామం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ వివరించారు.

లాక్​డౌన్​ సాగినన్ని రోజులు తమ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో రోజుకు 300 మంది ఆకలిని తీరుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు వెయ్యి మందికి భోజనం పెట్టడమే తమ లక్ష్యమన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

మోక్షారామం ఫౌండేషన్


ఇవీ చూడండి: మాస్క్‌ మళ్లీ మళ్లీ వాడేలా.. లామినేట్‌ షీట్‌తో ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.