ETV Bharat / city

70 మందిని క్వారంటైన్ నుంచి విడుదల చేశాం : సత్యవతి - 70 మంది క్వారంటైన్లను విడుదల చేశాం : మంత్రి సత్యవతి రాథోడ్

విదేశాల నుంచి జిల్లాకు వచ్చి హోమ్ క్వారంటైన్​లో ఉన్న 115 మందిలో 70 మందిని డిశ్చార్జి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.

Minister Satyavathi Rathod Press Meet In collectorate Office
70 మంది క్వారంటైన్లను విడుదల చేశాం : మంత్రి సత్యవతి రాథోడ్
author img

By

Published : Mar 26, 2020, 8:45 PM IST

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 115 మందిలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ హోమ్ క్వారంటైన్ చేశామని, అందులో 70 మంది హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నారని ప్రకటించారు.

ప్రతిఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపాలని.. అదే మీరు రాష్ట్రానికి, దేశానికి చేసే గొప్ప సేవ అన్నారు. విదేశాల నుండి​ జిల్లాకు వచ్చి సమాచారం ఇవ్వకుండా బయట తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్​కు తరలించామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పాస్​పోర్ట్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు కరోనా బాధితులను చిన్నచూపు చూడొద్దని కోరారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ ఛైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : రోడ్లపై ఇష్టారాజ్యంగా కంచెలు.. లైన్‌మెన్​ బలి

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 115 మందిలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ హోమ్ క్వారంటైన్ చేశామని, అందులో 70 మంది హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నారని ప్రకటించారు.

ప్రతిఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపాలని.. అదే మీరు రాష్ట్రానికి, దేశానికి చేసే గొప్ప సేవ అన్నారు. విదేశాల నుండి​ జిల్లాకు వచ్చి సమాచారం ఇవ్వకుండా బయట తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్​కు తరలించామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పాస్​పోర్ట్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు కరోనా బాధితులను చిన్నచూపు చూడొద్దని కోరారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ ఛైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : రోడ్లపై ఇష్టారాజ్యంగా కంచెలు.. లైన్‌మెన్​ బలి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.