ETV Bharat / city

నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం.. ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు - kakatiya saptaham

నేటి నుంచి వారం పాటు కాకతీయ సప్తాహ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో కాకతీయ 22వ తరం వారసులైన కమల్​ చంద్ర భంజ్​ దేవ్​ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు మొదలైనవి నిర్వహించనున్నారు.

కాకతీయ
కాకతీయ
author img

By

Published : Jul 7, 2022, 5:26 AM IST

కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఏడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కాకతీయ 22వ తరం వారసులైన కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.

ఇందుకోసం ఆయన చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి వరంగల్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌ చంద్ర భంజ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. అటు కాకతీయ కట్టడాల నిర్మాణంలో దాగిన సాంకేతికతపై సదస్సులు, కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఏడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కాకతీయ 22వ తరం వారసులైన కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.

ఇందుకోసం ఆయన చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి వరంగల్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌ చంద్ర భంజ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. అటు కాకతీయ కట్టడాల నిర్మాణంలో దాగిన సాంకేతికతపై సదస్సులు, కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి : 'కలిసికట్టుగా పోరాడదాం..' వైరలవుతోన్న రైతుబిడ్డ వీడియో సందేశం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.