ETV Bharat / city

CORONA: కరోనా థర్డ్​వేవ్​ హెచ్చరికలున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..

author img

By

Published : Aug 10, 2021, 5:42 AM IST

కరోనా ఒకటి, రెండు దశలు.. విలయ తాండవం చేసినా వారికింకా సోయిరాలేదు. మరోవైపు థర్డ్​వేవ్​ ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. వారిలో ఏ మాత్రం అప్రమత్తత లేదు. బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న కొవిడ్​ నిబంధలను యథేచ్చగా గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా.. మరోసారి కరోనా విజృంభణకు కారణమవుతున్నారు.

covid rule violation in Warangal
covid rule violation in Warangal

కరోనా రెండోదశ మనుషుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు మూడోదశపై నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనేకమంది కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్‌ జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. ప్రజల్లో ఆందోళన కనిపించడం లేదు.

ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే..

వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పట్టణవాసులు అనేకమంది కరోనా నిబంధనలను గాలికొదిలేసి తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతకుముందు రోజుకు 20 కేసులు నమోదుకాగా... గత వారం, పది రోజుల్లో 50 వరకు కేసులు నమోదయ్యాయి.

పైగా పండుగ సమయాలు..

కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన ప్రభుత్వం... నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. కొన్నిరోజులు.. అంతా సక్రమంగానే ఉన్నా... ఇటీవల అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా... కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్యులు పదే పదే చెబుతున్నా.. నగరవాసులు ఆ మాటలు లెక్కచేయడం లేదు. మూడో ముప్పు పొంచి ఉందని ఓ వైపు నిపుణులు చెబుతున్నా... కొందరిలో నిర్లక్ష్యం పెరుగుతోంది. పైగా శ్రావణమాసం కావడంతో పండగలు మొదలవుతున్నాయి. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉండడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. గత అనుభవాలను మర్చిపోయి నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి: TS corona cases: రాష్ట్రంలో 80,658 మందికి పరీక్షలు.. 453 కొత్త కేసులు

కరోనా రెండోదశ మనుషుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు మూడోదశపై నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనేకమంది కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్‌ జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. ప్రజల్లో ఆందోళన కనిపించడం లేదు.

ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే..

వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పట్టణవాసులు అనేకమంది కరోనా నిబంధనలను గాలికొదిలేసి తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతకుముందు రోజుకు 20 కేసులు నమోదుకాగా... గత వారం, పది రోజుల్లో 50 వరకు కేసులు నమోదయ్యాయి.

పైగా పండుగ సమయాలు..

కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన ప్రభుత్వం... నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. కొన్నిరోజులు.. అంతా సక్రమంగానే ఉన్నా... ఇటీవల అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా... కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్యులు పదే పదే చెబుతున్నా.. నగరవాసులు ఆ మాటలు లెక్కచేయడం లేదు. మూడో ముప్పు పొంచి ఉందని ఓ వైపు నిపుణులు చెబుతున్నా... కొందరిలో నిర్లక్ష్యం పెరుగుతోంది. పైగా శ్రావణమాసం కావడంతో పండగలు మొదలవుతున్నాయి. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉండడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. గత అనుభవాలను మర్చిపోయి నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి: TS corona cases: రాష్ట్రంలో 80,658 మందికి పరీక్షలు.. 453 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.