ETV Bharat / city

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేట్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. గేట్ పడింది అంటే చాలు గేటు ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవాల్సిందే. బుధవారం సంతరోజు రైల్వే క్రాసింగ్ పడి, ఇంకా ఏవైనా శుభకార్యాలు ఉంటే పరిస్థితి మరింత దారుణం.

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!
author img

By

Published : May 16, 2019, 12:18 PM IST

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక రాష్ట్రాన్ని అనుసంధానం చేస్తూ 167వ జాతీయ రహదారిని నిర్మించారు. కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లే రైళ్లన్నీ దేవరకద్ర మీదుగానే వెళ్తుంటాయి. నిత్యం సగటున 50 రైళ్లు ఈ మార్గాన రాకపోకలు నిర్వహిస్తుంటాయి. రైలొచ్చే సమయంలో జాతీయ రహదారిపై పైవంతెన లేకపోవడంతో గేటు ద్వారా నియంత్రిస్తుంటారు.

ప్రతీ బుధవారం ఇక్కడ సంత జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసగా గంట వ్యవధిలోనే 4 రైళ్ల రాకపోకలు కొనసాగాయి. గేటును మళ్లీమళ్లీ వేయడం, సంత, దీనికి తోడు శుభకార్యాలు తోడైనందున వాహనాల రద్దీ పెరిగింది. దానికి తోడు తీవ్రమైన ఎండ. ప్రయాణికులకు నరకం చూపించింది. బస్సుల్లో ప్రైవేటు వాహనాల్లో వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ఒక వాహనం గేటు దాటేందుకు 15 నుంచి 40 నిమిషాల సమయం పట్టింది. అధికారులు ఈ సమస్యను గతంలోనే గుర్తించి ఆర్​ఓబీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. అది అయ్యేవరకు గేటుకు ఇరువైపులా నీడను ఏర్పాటు చేసి వాహన దారుల దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వీలైనంత త్వరగా ఆర్​ఓబీని ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక రాష్ట్రాన్ని అనుసంధానం చేస్తూ 167వ జాతీయ రహదారిని నిర్మించారు. కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లే రైళ్లన్నీ దేవరకద్ర మీదుగానే వెళ్తుంటాయి. నిత్యం సగటున 50 రైళ్లు ఈ మార్గాన రాకపోకలు నిర్వహిస్తుంటాయి. రైలొచ్చే సమయంలో జాతీయ రహదారిపై పైవంతెన లేకపోవడంతో గేటు ద్వారా నియంత్రిస్తుంటారు.

ప్రతీ బుధవారం ఇక్కడ సంత జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసగా గంట వ్యవధిలోనే 4 రైళ్ల రాకపోకలు కొనసాగాయి. గేటును మళ్లీమళ్లీ వేయడం, సంత, దీనికి తోడు శుభకార్యాలు తోడైనందున వాహనాల రద్దీ పెరిగింది. దానికి తోడు తీవ్రమైన ఎండ. ప్రయాణికులకు నరకం చూపించింది. బస్సుల్లో ప్రైవేటు వాహనాల్లో వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ఒక వాహనం గేటు దాటేందుకు 15 నుంచి 40 నిమిషాల సమయం పట్టింది. అధికారులు ఈ సమస్యను గతంలోనే గుర్తించి ఆర్​ఓబీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. అది అయ్యేవరకు గేటుకు ఇరువైపులా నీడను ఏర్పాటు చేసి వాహన దారుల దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వీలైనంత త్వరగా ఆర్​ఓబీని ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

Intro:Tg_Mbnr_05_15_Trine_Get_Traffic_Jam_Pkg_G3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేట్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. రైల్వే గేట్ పడింది అంటే చాలు గేటు ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవాల్సిందే. ఓ వేళ రైల్వే క్రాసింగ్ ఉన్నా, దేవరకద్ర లో బుధవారం సంత దినం రోజు అది ఏవైనా శుభకార్యాలు ఉంటే ఆరోజు గేటు పడిన సమయంలో భారీస్థాయిలో వరుస కట్టిన వాహనాల రాకపోకలను నియంత్రించక ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించడం శర మామూలుగా మారింది.



Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక రాష్ట్రాన్ని అనుసంధానం చేస్తూ 167వ జాతీయ రహదారిని నిర్మించారు. కాచిగూడ నుంచి కర్నూలు వైపు నకు రాకపోకలు నిర్వహించే రైళ్లన్నీ దేవరకద్ర మీద అ వెళ్తూ ఉంటాయి. నిత్యము సగటున 45 నుంచి 50 రైలు ఈ మార్గాన రాకపోకలు నిర్వహిస్తుంటాయి.
రైళ్ల రాకపోకలు సమయంలో జాతీయ రహదారిపై పైవంతెన లేకపోవడంతో వాహనాల రాకపోకలను దేవరకద్ర రైల్వే గేటు ద్వారా నియంత్రిస్తూ ఇటు రైళ్లు అటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి
బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసగా గంట వ్యవధిలోనే 4 రైళ్ల రాకపోకలు కొనసాగాయి. గేటును మళ్లీమళ్లీ వేయడం, బుధవారం సంత దినము శుభకార్యాల దినం రెండు కలిసి రావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంది దానికి తోడు తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గేటు తీసిన వెంటనే వేగంగా దూసుకు వచ్చే వాహనాలతో మరోపక్క తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బస్సుల్లో ప్రైవేటు వాహనాల్లో వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు .ఆర్ ఓ బి నిర్మాణం పూర్తి అయ్యేవరకు గేటుకు ఇరువైపులా నీడను ఏర్పాటు చేసి వాహన దారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బైట్స్
1. సురేష్
2. సంజీవ
3. ప్రకాష్




Conclusion:దేవరకద్ర రైల్వే గేట్ వాహనాల రాకపోకలకు ప్రధాన సమస్యగా మారింది. గేటు పడిన సమయంలో 15 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మండుటెండల్లో ఇరువైపులా వాహనాల నిలిపి ఉంచడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు అధికారులు స్పందించి గేటు ఇరువైపులా నీడను ఏర్పాటు చేస్తే మనం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.