ETV Bharat / city

కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​ - మహబూబ్​నగర్​లో ప్రైవేటు ఆస్పత్రి సీజ్​

private hospital sezed in mahabubnagar
కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​
author img

By

Published : Apr 6, 2020, 1:00 PM IST

Updated : Apr 6, 2020, 4:05 PM IST

12:56 April 06

కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​

కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​

     కరోనాతో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో మహబూబ్​నగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.  

             రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మహబూబ్​నగర్​లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. సదరు మహిళను పరీక్షించిన వైద్యుడు నిబంధనలకు విరుద్ధంగా ఎండోస్కోపీ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడం వల్ల జనరల్​ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 

        పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జనరల్​ ఆస్పత్రి నుంచి హైదరాబాద్​ ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వల్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవిడ్​-19 నిర్ధరణ అయింది.  

     మహబూబ్​నగర్​లో ఆమె చికిత్స పొందిన ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. ఆస్పత్రిలో రసాయనాలను స్ప్రే చేయించిన అనంతరం సీజ్​ చేశారు. 

ఇవీచూడండి: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్

12:56 April 06

కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​

కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్​

     కరోనాతో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో మహబూబ్​నగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.  

             రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మహబూబ్​నగర్​లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. సదరు మహిళను పరీక్షించిన వైద్యుడు నిబంధనలకు విరుద్ధంగా ఎండోస్కోపీ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడం వల్ల జనరల్​ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 

        పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జనరల్​ ఆస్పత్రి నుంచి హైదరాబాద్​ ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వల్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవిడ్​-19 నిర్ధరణ అయింది.  

     మహబూబ్​నగర్​లో ఆమె చికిత్స పొందిన ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. ఆస్పత్రిలో రసాయనాలను స్ప్రే చేయించిన అనంతరం సీజ్​ చేశారు. 

ఇవీచూడండి: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్

Last Updated : Apr 6, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.