ETV Bharat / city

ఆన్​లైన్​ ద్వారా ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే

author img

By

Published : Oct 8, 2020, 11:04 AM IST

Updated : Oct 8, 2020, 2:04 PM IST

అత్యాచార, పొక్సో కేసుల విచారణ వేగంగా జరిపేందుకు... మహబూబ్​నగర్​, షాద్​నగర్​లో ఫాస్ట్​ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. హైకోర్టు సీజే ఆర్​ఎస్​ చౌహాన్​... ఆన్​లైన్​ ద్వారా వీటిని ప్రారంభించారు.

ఆన్​లైన్​ ద్వారా ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే
ఆన్​లైన్​ ద్వారా ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే

మహబూబ్​నగర్​ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును... హైకోర్టు సీజే రాఘవేంద్ర సింగ్ చౌహాన్​ ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచార కేసుల సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 6 ఫాస్ట్​ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా అదనపు మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రఘురామ్​ తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో నాగర్​కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఫాస్ట్​ట్రాక్​ కోర్టులను శుక్రవారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. జోగులాంబ గద్వాలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కేసుల సత్వర పరిష్కారానికి బార్ అసోసియేషన్, న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి పాల్గొన్నారు.

ఆన్​లైన్​ ద్వారా ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే

ఇదీ చూడండి: అర్ధరాత్రి అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారీ వీరవనితలు!

మహబూబ్​నగర్​ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును... హైకోర్టు సీజే రాఘవేంద్ర సింగ్ చౌహాన్​ ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచార కేసుల సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 6 ఫాస్ట్​ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా అదనపు మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రఘురామ్​ తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో నాగర్​కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఫాస్ట్​ట్రాక్​ కోర్టులను శుక్రవారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. జోగులాంబ గద్వాలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కేసుల సత్వర పరిష్కారానికి బార్ అసోసియేషన్, న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి పాల్గొన్నారు.

ఆన్​లైన్​ ద్వారా ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే

ఇదీ చూడండి: అర్ధరాత్రి అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారీ వీరవనితలు!

Last Updated : Oct 8, 2020, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.