ETV Bharat / city

వలస కార్మికులను అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Apr 18, 2020, 10:07 PM IST

ఖమ్మం జిల్లా బల్లేపల్లి నుంచి కాలినడకన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు చేరుకున్న 12 మంది వలస కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.

Khammam Police Stops Immigration labors
వలస కార్మికులను అడ్డుకున్న పోలీసులు

ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం రామాపురం గ్రామానికి చెందిన 12 మంది వలస కార్మికులు బల్లేపల్లిలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో కార్మికులు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బయలుదేరారు. రెండు రోజుల క్రితం బయలుదేరిన కార్మికులు శనివారం మణుగూరుకు చేరుకున్నారు.

మణుగూరు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకొని అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి, సీఐ షూకూర్ అక్కడికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారికి ఆహారం , తాగు నీరు అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి వారిని ప్రత్యేక వాహనంలో ఖమ్మం తరలించారు.

ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం రామాపురం గ్రామానికి చెందిన 12 మంది వలస కార్మికులు బల్లేపల్లిలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో కార్మికులు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బయలుదేరారు. రెండు రోజుల క్రితం బయలుదేరిన కార్మికులు శనివారం మణుగూరుకు చేరుకున్నారు.

మణుగూరు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకొని అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి, సీఐ షూకూర్ అక్కడికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారికి ఆహారం , తాగు నీరు అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి వారిని ప్రత్యేక వాహనంలో ఖమ్మం తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.