1981-82 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు.. మొదటిసారిగా తాము చదువుకున్న ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు.
ఈ సమ్మేళనానికి నాటి పూర్వ విద్యార్థి, ప్రస్తుత గవర్నర్ సహాయ కార్యదర్శి చింతా సీతారాములు హాజరై స్నేహితులతో సంతోషంగా గడిపారు. రెండు రోజులపాటు స్నేహితులంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి పాతగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం