జైళ్ల శాఖలో సంస్కరణలు అమలుచేసి విజయవంతమయ్యామని.. పోలీస్ అకాడమీలోనూ అటువంటి చర్యలే అవసరమని అకాడమీ డైరెక్టర్ వీకేసింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలో పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయని వారిని అకాడమీలో పడేస్తున్నారన్నారు. అకాడమీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు మొత్తం వృథా అవుతోందని వీకే సింగ్ అభిప్రాయపడ్డారు. నేటికి బ్రిటిష్ కాలం నాటి పద్దతుల్లోనే పోలీసుల పనితీరు కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు జాతీయ పోలీస్ అకాడమీలోను ఇటువంటి పరిస్థితులే ఉన్నాయన్నారు.
ఎస్పీ నుంచి పోలీసు ఠాణా అధికారి వరకు క్షేత్రస్థాయి పనితీరు ఆధారం చేసుకుని డీజీపీకి నివేదికను అందజేస్తానని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని కోరారు. జైలు వస్తున్న వారిలో 90 శాతం బీదవారేనన్న వీకే సింగ్.. అసలు ఏ నేరంపై అరెస్టయ్యారో చాలా మందికి తెలియడం లేదన్నారు.
ఇవీచూడండి: 'ప్రజావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తా'