ETV Bharat / city

పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు - ఏపీ వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైతులను ఏనుగుల గుంపు వణికిస్తోంది. వరి కుప్పలపై నుంచి ఆ గుంపు వెళ్లిన కారణంగా.. పంటంతా నాశనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

villagers-feared-with-elephants-attacks-on-crops-at-burjupadu in srikakulam AP
పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు
author img

By

Published : Dec 27, 2020, 10:57 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. బూర్జపాడులో నిన్న రాత్రి వరికుప్పలపైనుంచి వెళ్లి పంట నాశనం చేయగా.. రైతులు లబోదిబోమంటున్నారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు

కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారి పి. అమ్మనునాయుడు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏనుగుల గుంపు కోసం అన్వేషణ ప్రారంభించారు. అడుగుల ఆధారంగా 4 పెద్దవి, ఒక పిల్ల ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించారు. సన్యాసి పుట్టుగ, కేశపురం, డొంకూరు, చిన్న పెద్ద లక్ష్మీపురాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:దత్తపుత్రికను పెళ్లికూతురిని చేసిన సీఎం కేసీఆర్ సతీమణి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. బూర్జపాడులో నిన్న రాత్రి వరికుప్పలపైనుంచి వెళ్లి పంట నాశనం చేయగా.. రైతులు లబోదిబోమంటున్నారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు

కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారి పి. అమ్మనునాయుడు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏనుగుల గుంపు కోసం అన్వేషణ ప్రారంభించారు. అడుగుల ఆధారంగా 4 పెద్దవి, ఒక పిల్ల ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించారు. సన్యాసి పుట్టుగ, కేశపురం, డొంకూరు, చిన్న పెద్ద లక్ష్మీపురాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:దత్తపుత్రికను పెళ్లికూతురిని చేసిన సీఎం కేసీఆర్ సతీమణి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.