ETV Bharat / city

దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

author img

By

Published : Dec 4, 2019, 12:30 AM IST

సుధీర్ఘకాలం కొనసాగిన ఆర్టీసీ సమ్మె సమయంలో... బస్సులు డిపోల్లో ఉంటే కార్మికులు వీధుల్లో ఉన్నారు. 55 రోజులపాటు బస్సులు రోడ్డెక్కక డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో చాలా బస్సులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం వచ్చింది . ప్రత్యామ్నాయ, అనుభవం లేని డ్రైవర్లు నడపడం వల్ల మరికొన్ని బస్సుల్లో గేర్ బాక్స్​లు, క్లచ్​లు చెడిపోయాయి. మరో రెండు రోజులైతే కానీ... పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.

దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..
దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

గ్యారేజీలో వైద్యం చేయించుకుంటున్న బస్సులు...

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 55 రోజుల పాటు చేసిన సమ్మెతో చాలా బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరండి అని పిలుపునివ్వడం వల్ల ఒక్కసారిగా కార్మికులు విధుల్లో చేరిపోయారు. అయితే డ్రైవర్లు నడపాలనుకున్నా.. బస్సులే అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికీ పదిశాతం బస్సులకు ఇంకా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయిని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు 3,500ల బస్సులు 9.70 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు నిత్యం 33లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చుతుంటాయి.

సమ్మె కాలంలో గ్రేటర్ పరిధిలోని బస్సుల్లో కేవలం 50శాతం మాత్రమే తిరిగాయని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. ఇక తిరిగిన 50శాతం బస్సుల్లో ఎక్కువశాతం బస్సులను తిప్పింది అనుభవంలేని డ్రైవర్లు కావడం వల్ల ఇష్టారాజ్యంగా బస్సులను నడిపారు. దీంతో ఆ బస్సులకు సంబంధించిన గేర్​బాక్స్​లు, క్లచ్​లు దెబ్బతిన్నాయి. ఒక్కో బస్సుకు ఒక్కోరకమైన గేర్ చెడిపోయి.. వాటిని స్టోర్ నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటి బస్సులకు అద్దాలు పగిలిపోవడం, బాడీ దెబ్బతినడం జరిగింది. చాలా రోజులు నడపకపోవడం వల్ల బ్యాటరీలు డిస్చార్జి అయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 డిపోల పరిధిలో 668 బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఒక్క మంథని డిపోలోనే 54కు సుమారు 20 బస్సులు దెబ్బతిన్నాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం నడపడం వల్ల.. కనీస నిర్వహణ లేక బస్సులు పాడయ్యాయని కార్మికులు చెబుతున్నారు.

సమ్మెకాలంలో మరమ్మతులు జరగలేదు...

బస్సుల కండీషన్​ను ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది. టైర్లు, జాయింట్లు ,రేడియేటర్​లు, స్ప్రింగులు, ఆయిల్ సీల్లు, లీకేజీలు పరిశీలించాలి. బస్సులకు గ్రీసింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్​లు వారానికి ఒకసారి శుభ్రపరచాలి. సమ్మె కాలంలో వీటి నిర్వహణ తప్పి నిర్దిష్టంగా జరగాల్సిన పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదని మెకానిక్​లు తెలిపారు. గ్యారేజ్​లో తాత్కాలిక విధులు నిర్వహించిన కార్మికులు చేతి వాటం ప్రదర్శించి, సంస్థ పనిముట్లను ఎత్తుకెళ్లారని ఉద్యోగులు వాపోయారు.

బస్సుల మరమ్మత్తులు యుద్దప్రాతిపదికన చేయిస్తున్నామని... అధికారులు పేర్కొంటున్నారు. ఐతే.. వాటి రిపేర్లకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్లే రిపేర్లు ఆలస్యమవుతున్నాయంటున్నారు.

దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

ఇవీ చూడండి: 'తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'

గ్యారేజీలో వైద్యం చేయించుకుంటున్న బస్సులు...

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 55 రోజుల పాటు చేసిన సమ్మెతో చాలా బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరండి అని పిలుపునివ్వడం వల్ల ఒక్కసారిగా కార్మికులు విధుల్లో చేరిపోయారు. అయితే డ్రైవర్లు నడపాలనుకున్నా.. బస్సులే అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికీ పదిశాతం బస్సులకు ఇంకా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయిని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు 3,500ల బస్సులు 9.70 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు నిత్యం 33లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చుతుంటాయి.

సమ్మె కాలంలో గ్రేటర్ పరిధిలోని బస్సుల్లో కేవలం 50శాతం మాత్రమే తిరిగాయని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. ఇక తిరిగిన 50శాతం బస్సుల్లో ఎక్కువశాతం బస్సులను తిప్పింది అనుభవంలేని డ్రైవర్లు కావడం వల్ల ఇష్టారాజ్యంగా బస్సులను నడిపారు. దీంతో ఆ బస్సులకు సంబంధించిన గేర్​బాక్స్​లు, క్లచ్​లు దెబ్బతిన్నాయి. ఒక్కో బస్సుకు ఒక్కోరకమైన గేర్ చెడిపోయి.. వాటిని స్టోర్ నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటి బస్సులకు అద్దాలు పగిలిపోవడం, బాడీ దెబ్బతినడం జరిగింది. చాలా రోజులు నడపకపోవడం వల్ల బ్యాటరీలు డిస్చార్జి అయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 డిపోల పరిధిలో 668 బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఒక్క మంథని డిపోలోనే 54కు సుమారు 20 బస్సులు దెబ్బతిన్నాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం నడపడం వల్ల.. కనీస నిర్వహణ లేక బస్సులు పాడయ్యాయని కార్మికులు చెబుతున్నారు.

సమ్మెకాలంలో మరమ్మతులు జరగలేదు...

బస్సుల కండీషన్​ను ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది. టైర్లు, జాయింట్లు ,రేడియేటర్​లు, స్ప్రింగులు, ఆయిల్ సీల్లు, లీకేజీలు పరిశీలించాలి. బస్సులకు గ్రీసింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్​లు వారానికి ఒకసారి శుభ్రపరచాలి. సమ్మె కాలంలో వీటి నిర్వహణ తప్పి నిర్దిష్టంగా జరగాల్సిన పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదని మెకానిక్​లు తెలిపారు. గ్యారేజ్​లో తాత్కాలిక విధులు నిర్వహించిన కార్మికులు చేతి వాటం ప్రదర్శించి, సంస్థ పనిముట్లను ఎత్తుకెళ్లారని ఉద్యోగులు వాపోయారు.

బస్సుల మరమ్మత్తులు యుద్దప్రాతిపదికన చేయిస్తున్నామని... అధికారులు పేర్కొంటున్నారు. ఐతే.. వాటి రిపేర్లకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్లే రిపేర్లు ఆలస్యమవుతున్నాయంటున్నారు.

దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

ఇవీ చూడండి: 'తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'

TG_KRN_105_3_SAMME KASTAALU_PKG_TS10125. యం.శివప్రసాద్, మంథని, 9440728281. సమ్మె కష్టాలు. ఆర్టీసీ సమ్మెతో డిపోలు విలవిలలాడుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో అనేక కష్టాలు ఉత్పన్నమయ్యాయి. సరైన నిర్వహణ లేక బస్సులు అనేకం మరమ్మతులకు గురయ్యాయి. సమ్మె కాలంలో తాత్కాలిక కార్మికులు చేతివాటం చూపించారు. సమ్మె ముగియడంతో ఒక్కసారిగా శ్రమ భారం పెరిగింది. 52 రోజుల ఆర్టీసీ సమ్మె అనంతరం ఉద్యోగులు విధుల్లో కి చేరారు. పెద్దపెల్లి జిల్లా మంథని డిపో లో 54 బస్సు ఉండగా వీటిలో సుమారు 20 బస్సులు దెబ్బతిన్నాయి. సమ్మె కాలంలో తాత్కాలిక చోదకులు ఇష్టానుసారం బస్సు నడపడంతో సరైన మరమ్మత్తులు కనీస నిర్వాహణ లేని కారణంగా బస్సులు పాడయ్యాయి అని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 డిపోల పరిధిలో 668 బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు 52 రోజుల పాటు కొనసాగించారు. ఈ సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది పడకూడదని ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించారు. శిక్షణ లేని వారు కావడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. మరోవైపు ఇష్టారాజ్యంగా నడపడంతో విడిభాగాలు దెబ్బతిన్నాయి. సమ్మె ముగిసిన తర్వాత కార్మికులు విధుల్లో చేరగా అన్ని డిపోల్లో బస్సులు మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి .వందల సంఖ్యలో బస్సులుమొరాయిస్తున్నాయని మళ్లీ విధుల్లో చేరిన ఉద్యోగులు చెబుతున్నారు .సరైన నిర్వహణ లేని కారణంగా బస్సులు నడిచే సమయంలో చాలా చప్పుడు వస్తుందనీ చాలామంది డ్రైవర్లు చెపుతున్నారు. నిర్వహణ లోపం మరమ్మతులు కరువు: ప్రతిరోజు బస్సుల కండీషన్ చూడాల్సి ఉంటుంది. టైర్లు, జాయింట్లు ,రేడియేటర్ లు, స్ప్రింగులు, ఆయిల్ సీల్లు, లీకేజీలు పరిశీలించాలి. షెడ్యూల్ 2 లో బస్సులకు గ్రీసింగ్ చేయడం వంటివి ఉంటాయి. షెడ్యూల్ 3 లో బ్రేకులు ఇంజిన్ ల మరమ్మతులు నిర్దిష్ట సమయం ఉంటుంది. షెడ్యూల్ 4 లో సర్వీసింగ్ తో పాటు గేర్ బాక్స్, ఇంజిన్, ఇతర విభాగాల ఓవర్ ఆయిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ లు వారానికొకసారి శుభ్రపరచాలి సమ్మె కాలంలో కనీసం నిర్వహణ తప్పితే నిర్దిష్టంగా జరగాల్సిన పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదని చెప్పుకొచ్చారు. మెకానిక్ లు, పర్యవేక్షకులు అంతా సమ్మెలో ఉండడం వల్ల తాత్కాలిక మెకానికలే నిర్వహించారు. బస్సులు ఆగకూడదు అన్న పట్టుదలతో బస్సు నడిపించారు కానీ వాటి పరిస్థితి ఏమిటన్నది మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మికులు వాపోయారు. సమ్మె సమయంలో అనుభవం లేని చోదకుల తో బస్సులు నడిపించడం వల్ల జాయింట్లు బ్రేక్ వ్యవస్థ బాగా దెబ్బతిన్నాయన్నారు. కచ్ డిస్కులు కూడా పాడయ్యాయి. టైర్లు సకాలంలో మార్చకపోవడం వల్ల రీ బటన్ కు కూడా పనికిరాకుండా పోయాయి అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సమ్మె కాలంలో బస్సుల నిర్వహణ మరమ్మతులు జరగలేదని అధికారులు కూడా అంగీకరించారు. సమ్మె సమయంలో ఇంధన వ్యయం కూడా పెరిగిందని,సమ్మెలో బస్సులు లీటరుకు 2.3 కిలోమీటర్లు మాత్రమే తిరిగాయని, సమ్మె కంటే ముందు లీటరుకు 5.4 నుంచి 6 కిలోమీటర్ల మేర దూరం తిరిగేవి అని చెప్పుకొచ్చారు. సమ్మె సమయంలో బస్సుల లోని రేడియేటర్ లలో నీరు పోయకుండా ఏకధాటిగా నడపడం వల్ల బస్సుల యొక్క ఇంజన్లు జాం ఐయి పొగ బాగా వస్తుందని, చెప్పుకొచ్చారు. మంథని డిపో లో సమ్మె అనంతరం 2 బస్సులు పూర్తిగా స్క్రాప్ కిందికి వెళ్లాయని చెప్పుకొచ్చారు, ప్రస్తుతం 53 బస్సులు మాత్రమే రన్నింగ్ కండిషన్ లో ఉన్నాయని అన్నారు. సమ్మెలో గ్యారేజ్ లో తాత్కాలిక విధులు నిర్వహించిన కార్మికులు చేతి వాటం ప్రదర్శించి, ఉద్యోగుల పనిముట్లను ఎత్తుకెళ్లారు అని ఉద్యోగులు వాపోయారు. పాడైన టిమ్ లు. ఆర్టీసీ సమ్మె సమయంలో నిరుద్యోగులు తాత్కాలిక కండక్టర్ గా విధులు నిర్వహించారు.టిక్కెట్లు ఇచ్చేందుకు వీరికి ఇచ్చారు. అందరికీ వీటిపై అవగాహన లేకపోవడంతో వాడే సమయంలో చేసిన పొరపాట్ల తో పాడయ్యాయి. ఇప్పుడు విధుల్లో చేరిన శాశ్వత కార్మికులు ఈ టిమ్ లతో నానా తంటాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఈ సమ్మె వల్ల అందరికీ కొత్త కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. బైట్. 1.TBR. స్వామి బి.డి బ్యూటీ సూపరిండెంట్ గ్యారేజ్ ఇంచార్జ్ మంథని డిపో. 2. కోటేశ్వర్ మెకానిక్ మంథని డిపో. 3. సంపత్ మెకానిక్ మంథని డిపో. 4. రవి టైర్ల మెకానిక్ మంచిని డిపో. .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.