1. హైకోర్టు ఆమోదం
అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో ఆంధ్రాబ్యాంకు రెండు ఆస్తులను వేలం వేసింది. వేలంలో దక్కించుకున్న వారికి ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. విభజనకు నిర్ణయం
అత్యంత సులువైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసమే సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నాలుగు రకాలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్లై ఓవర్ కింద అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా.. నిప్పురవ్వలు థర్మాకోల్ షీట్పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కరంటోళ్ల నిరాహార దీక్ష
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 'కరంటోళ్ల నిరాహార దీక్ష' పేరిట విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జేఈఈ మెయిన్- షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కరోనా మందులు సూచించొద్దు
కరోనా చికిత్సకు మందులు సూచించడం లేదా వాటిని ప్రచారం చేయడం గానీ చేయకూడదని ఆయుష్, హోమియోపతి వైద్యులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేరళ హైకోర్టు ఆగస్టు 21న వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈ మేరకు స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆస్ట్రేలియా అతలాకుతలం
ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాగర తీరంలో అలలు భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.పెరిగిన బంగారం ధర
దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో మంగళవారం రూ.510కిపైగా ఎగిసింది. వెండి ధర కిలోకు మళ్లీ రూ.63,600 పైకి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ప్రభాస్ చిత్రంలో సూపర్ స్టార్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సినిమా 'సలార్'. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. లిన్, లారెన్స్లకు ఫైన్
బిగ్బాష్ లీగ్లోని ఇద్దరు ఆటగాళ్లు కరోనా నిబంధనలు అతిక్రమించినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. బ్రిస్బేన్ జట్టుకు చెందిన క్రిస్ లిన్, డాన్ లారెన్స్లకు మంగళవారం జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.