టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ పోటీలను... రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీమ్ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులు... పలు క్రీడాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
మొదటి రోజు నిర్వహించే క్రికెట్లో 19 బృందాలు తలపడనున్నాయి. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పని చేసే ఉద్యోగులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వెంకటేశ్వర్రెడ్డి, సలీమ్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు... రోజూ వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.