ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై కేంద్రం అభ్యంతరం

author img

By

Published : Jun 17, 2022, 10:31 AM IST

ఈ ఏడాది రాష్ట్రం తీసుకునే అప్పుల మొత్తంలో కోత పడనుంది. కేంద్రం అభ్యంతరం చెబుతున్న బడ్జెటేతర రుణాలను నాలుగేళ్ల కాలానికి సర్దుబాటుచేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రతిపాదిత రుణాల్లో రూ. 14 వేల కోట్ల వరకు తగ్గే పరిస్థితి ఉంది. ఉదయ్ పథకానికి సంబంధించిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇంకా కొంత మొత్తం తగ్గే అవకాశం ఉంది.

loans
loans
రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై అభ్యంతరం చెబుతున్న కేంద్రప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం... ఎంత మొత్తం అప్పుల ద్వారా సమీకరించుకోవాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న కేంద్రం ఎఫ్ఆర్​బీఎమ్​ పరిధిలోకి లోబడి.. బాండ్ల జారీద్వారా తీసుకునే అప్పుల మొత్తాన్ని తేల్చలేదు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానాలిచ్చిన రాష్ట్రం.. ఎఫ్ఆర్​బీఎమ్​ కి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెట్ వెలుపల వివిధకార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించింది.

ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రెండు దఫాలుగా దిల్లీ వెళ్లి... కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తున్నందున వాటిని ఎఫ్ఆర్​బీఎమ్​ కిందే పరిగణిస్తామని అంటోంది. ఆ తరహా రుణాలు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రూ. 57వేల కోట్ల వరకు ఉన్నాయి. ఐతే... ఆ మొత్తాన్ని ఒకే ఏడాదికి కాకుండా నాలుగేళ్ల ఎఫ్ఆర్​బీఎమ్​ రుణాల్లో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు సమాచారం. అంటే 57 వేల కోట్ల అప్పు మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఎఫ్ఆర్​బీఎమ్​ అప్పుల్లో భాగంగా పరిగణిస్తారు. ఆ మేరకు... రూ. 14వేల కోట్లను ఏటా బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల్లో కోతవిధిస్తారు. అదే జరిగితే.. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించిన 53వేల కోట్లలో 14వేల కోట్లను తగ్గిస్తారు. మిగతా మొత్తానికి అనుమతిచ్చే అవకాశం ఉంది.

వాటికి అదనంగా ఉదయ్ పథకంలో భాగంగా డిస్కంల రుణాలకు చెందిన అప్పులతో పాటు... ఇతరాలను ఎఫ్ఆర్​బీఎమ్​ రుణాల్లో భాగంగానే చూస్తామని... కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రతిపాదిత అప్పుల మొత్తంలో భారీగా కోత పడనుంది. ఐతే ఆ విషయంపై ఇప్పటివరకు కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తాత్కాలిక ప్రాతిపదికన అనుమతివ్వటంతో.. ఈ నెలలో రాష్ట్రప్రభుత్వం 4వేల కోట్లను బాండ్లు జారీ చేసి రుణం ద్వారా సమకూర్చుకొంది. అయితే ఈ ఆర్థికసంవత్సరంలో.. అనుమతిచ్చే మొత్తానికి సంబంధించి నిరీక్షణ కొనసాగుతొంది. కేంద్రం నుంచి వచ్చే స్పష్టతకు అనుగుణంగా... రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను అమలు చేయనున్నారు.

ఇవీ చదవండి:Locality for Government Jobs : ఉద్యోగార్థులూ.. స్థానిక గురించి క్లారిటీ ఉందా..?

రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై అభ్యంతరం చెబుతున్న కేంద్రప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం... ఎంత మొత్తం అప్పుల ద్వారా సమీకరించుకోవాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న కేంద్రం ఎఫ్ఆర్​బీఎమ్​ పరిధిలోకి లోబడి.. బాండ్ల జారీద్వారా తీసుకునే అప్పుల మొత్తాన్ని తేల్చలేదు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానాలిచ్చిన రాష్ట్రం.. ఎఫ్ఆర్​బీఎమ్​ కి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెట్ వెలుపల వివిధకార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించింది.

ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రెండు దఫాలుగా దిల్లీ వెళ్లి... కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తున్నందున వాటిని ఎఫ్ఆర్​బీఎమ్​ కిందే పరిగణిస్తామని అంటోంది. ఆ తరహా రుణాలు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రూ. 57వేల కోట్ల వరకు ఉన్నాయి. ఐతే... ఆ మొత్తాన్ని ఒకే ఏడాదికి కాకుండా నాలుగేళ్ల ఎఫ్ఆర్​బీఎమ్​ రుణాల్లో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు సమాచారం. అంటే 57 వేల కోట్ల అప్పు మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఎఫ్ఆర్​బీఎమ్​ అప్పుల్లో భాగంగా పరిగణిస్తారు. ఆ మేరకు... రూ. 14వేల కోట్లను ఏటా బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల్లో కోతవిధిస్తారు. అదే జరిగితే.. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించిన 53వేల కోట్లలో 14వేల కోట్లను తగ్గిస్తారు. మిగతా మొత్తానికి అనుమతిచ్చే అవకాశం ఉంది.

వాటికి అదనంగా ఉదయ్ పథకంలో భాగంగా డిస్కంల రుణాలకు చెందిన అప్పులతో పాటు... ఇతరాలను ఎఫ్ఆర్​బీఎమ్​ రుణాల్లో భాగంగానే చూస్తామని... కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రతిపాదిత అప్పుల మొత్తంలో భారీగా కోత పడనుంది. ఐతే ఆ విషయంపై ఇప్పటివరకు కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తాత్కాలిక ప్రాతిపదికన అనుమతివ్వటంతో.. ఈ నెలలో రాష్ట్రప్రభుత్వం 4వేల కోట్లను బాండ్లు జారీ చేసి రుణం ద్వారా సమకూర్చుకొంది. అయితే ఈ ఆర్థికసంవత్సరంలో.. అనుమతిచ్చే మొత్తానికి సంబంధించి నిరీక్షణ కొనసాగుతొంది. కేంద్రం నుంచి వచ్చే స్పష్టతకు అనుగుణంగా... రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను అమలు చేయనున్నారు.

ఇవీ చదవండి:Locality for Government Jobs : ఉద్యోగార్థులూ.. స్థానిక గురించి క్లారిటీ ఉందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.