ETV Bharat / city

కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు మోసానికి ప్రయత్నించారు: సజ్జల

author img

By

Published : Mar 14, 2021, 8:52 PM IST

ఏపీలో సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయవంతం అయ్యాయని, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వాన్ని ఈ ఫలితాలు బలపరిచాయన్నారు. వైకాపా గెలుపు ప్రజల విజయమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నూరుశాతం అమలు చేశారని, చెప్పని హామీలను సైతం నెరవేర్చారని తెలిపారు.

కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు మోసానికి ప్రయత్నించారు: సజ్జల
కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు మోసానికి ప్రయత్నించారు: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత వాసులను అవమానించిన చంద్రబాబుకు జనం తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రయోజనం లేదు..

ఉద్యమం లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇంకో ప్రాంతాన్ని మోసం చేసేందుకు బాబు ప్రయత్నించారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు ప్రజలను ఆయన రెచ్చగొట్టినా ప్రయోజనం లేదన్నారు. ఆ ప్రాంతం వాళ్లు తమ రోషాన్ని చూపించి అతన్ని ఓడించారని సజ్జల విమర్శించారు. లేని సమస్యలు సృష్టిస్తూ.. జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు.

కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు మోసానికి ప్రయత్నించారు: సజ్జల

అర్థం చేసుకున్నారు..

అమరావతిలో ఆయన చేసిన మోసాన్ని జగన్ సరిదిద్దే ప్రయత్నం చేశారన్నారు. సీఎం ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఛైర్​పర్సన్లు, మేయర్ అభ్యర్థులను రెండు రోజుల్లో ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేసేలా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ.. తెరాసకు.. జనసేన మద్దతివ్వడం బాధ కలిగించింది: బండి సంజయ్​

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత వాసులను అవమానించిన చంద్రబాబుకు జనం తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రయోజనం లేదు..

ఉద్యమం లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇంకో ప్రాంతాన్ని మోసం చేసేందుకు బాబు ప్రయత్నించారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు ప్రజలను ఆయన రెచ్చగొట్టినా ప్రయోజనం లేదన్నారు. ఆ ప్రాంతం వాళ్లు తమ రోషాన్ని చూపించి అతన్ని ఓడించారని సజ్జల విమర్శించారు. లేని సమస్యలు సృష్టిస్తూ.. జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు.

కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు మోసానికి ప్రయత్నించారు: సజ్జల

అర్థం చేసుకున్నారు..

అమరావతిలో ఆయన చేసిన మోసాన్ని జగన్ సరిదిద్దే ప్రయత్నం చేశారన్నారు. సీఎం ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఛైర్​పర్సన్లు, మేయర్ అభ్యర్థులను రెండు రోజుల్లో ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేసేలా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ.. తెరాసకు.. జనసేన మద్దతివ్వడం బాధ కలిగించింది: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.