ETV Bharat / city

హైదరాబాద్​లో నవంబర్ 24న  ఫ్రీడమ్ 10కే రన్ - Hyderabad 10K Run - Register Today

భాగ్యనగరం నెక్లస్ రోడ్​లో నవంబర్ 24న ఫ్రీడమ్ 10కే రన్ నిర్వహిస్తున్నారు. ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. ఇక ఇప్పటికే రన్​లో పాల్గొనేందుకు పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్​లో నవంబర్ 24న  ఫ్రీడమ్ 10కే రన్ నిర్వహన
author img

By

Published : Nov 9, 2019, 10:46 AM IST

హైదరాబాద్ నగరవాసులను 10కే రన్ మరోమారు పలకరించనుంది. నవంబర్ 24న నెక్లస్ రోడ్​లో ఫ్రీడమ్ 10కే రన్​ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత, హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ డైరక్టర్ డి.సురేష్ బాబు, టాలీవుడ్ నటుడు నిఖిల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. రన్​లో పాల్గొనేందుకు ఇప్పటికే పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. దాదాపు 16వేల మందికి పైగా రన్​లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 10కే రన్​తో పాటు.. 5కే రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసినవారికి మెడల్స్ అందించనున్నట్టు ప్రకటించారు.

హైదరాబాద్ నగరవాసులను 10కే రన్ మరోమారు పలకరించనుంది. నవంబర్ 24న నెక్లస్ రోడ్​లో ఫ్రీడమ్ 10కే రన్​ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత, హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ డైరక్టర్ డి.సురేష్ బాబు, టాలీవుడ్ నటుడు నిఖిల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. రన్​లో పాల్గొనేందుకు ఇప్పటికే పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. దాదాపు 16వేల మందికి పైగా రన్​లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 10కే రన్​తో పాటు.. 5కే రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసినవారికి మెడల్స్ అందించనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: 'తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

TG_HYD_08_09_CHALO_TANK_BUND_PKG_3182400 ( )సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నేడు అన్ని ప్రతి పక్ష, వామ పక్ష పార్టీలు..పలు విద్యార్థి సంఘాలు...జెఏసీ నేతలు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపునకు పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రధాన నేతలు, కార్యకర్తను గృహ నిర్భందం చేశారు.కొందరు జేఏసీ నేతలను కూడా ఇప్పటికే ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు సమాచారం. వాయిస్ మిలియన్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరంలో పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది నేతలను ఇంటి నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. భాజపా నగర్ కార్యదర్శి రమేష్ యాదవ్, కూకట్ పల్లి లో పలలు నేతలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ డిపోకి చెందిన ముగ్గురు జేఏసీ నేతలను పోలీసుల ముదస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ తెలంగాణ ఎక్జిక్యూటివ్ మెంబర్ డా. డి సుధాకర్ ను చిక్కడపల్లి పోలీసుల అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ ను కూడా జూబ్లిహిల్ పోలీసులు ముందస్తుగా అరెడస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చే అవకాశం ఉండడంతో నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారుల వద్ద చెకింగ్ పాయింట్ లో ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి నగరంలోకి అనుమతిస్తున్నారు. ట్యాంక్ బండ్ దారి మొత్తం మూసేస్తున్న తరుణంలో ఆ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలు నిషేధించారు. వాహనాలను మిగతా ప్రాంతాల మీదుగా వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు . ట్యాంక్ బండ్ కు దారితీసే మార్గాలు అన్నింటిని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు వాయిస్ ట్యాంక్ బండ్ నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ తెలిపారు.ట్యాంక్ బండ్ వైపు వచ్చే రూట్లను మళ్లించి పలు రూట్లను నగర వాసులకు సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలు నిలిపివేస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ వచ్చే రూట్ ని కవాడిగుడా వైపు, ఆర్టీసీ క్రాస్ నుంచి ఇందిరా పార్కు వచ్చే వాహనాలు అశోక్ నగర్ నుంచి మళ్ళిస్తునట్లు వెల్లడించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాళ్ళు ప్రత్యామ్నాయ దారిలో వెళ్లాలని సూచించారు.హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాళ్ళు బషీర్ బాగ్ వైపు, ఓల్డ్ ఎమ్మెల్యే రూట్ నుంచి వచ్చే వాహనదారులు పిసిఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్ళిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనదారులు ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్ లెస్ రోడ్ అండ్ మింట్ కంఫౌండ్ వైపు మళ్ళించునున్నట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.