ETV Bharat / city

స్పుత్నిక్-వి టీకా తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్

author img

By

Published : May 14, 2021, 1:25 PM IST

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వి టీకా పంపిణీ ప్రారంభమైంది. వారం రోజుల క్రితమే రష్యా నుంచి వ్యాక్సిన్లు హైదరాబాద్​కు చేరుకోగా.. సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ అనుమతితో నేడు మొదటి డోసు ఇచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.

Sputnik-V, Sputnik-V vaccine, Sputnik-V vaccine
స్పుత్నిక్-వి, స్పుత్నిక్-వి టీకా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్

దేశంలో టీకా పంపిణీ వేగవంతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ.. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చింది. మాస్కో నుంచి ఈనెల 1నే స్పుత్నిక్-వి టీకా డోసులు హైదరాబాద్‌ చేరుకోగా...కౌసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ అనుమతితో ఇవాళ మొదటి డోసు ఇచ్చినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ సహా మరో నాలుగు సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. స్పుత్నిక్-వి ఒక్కో డోసు ధర 948 రూపాయలుగా నిర్ణయించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఈ ధరకు 5శాతం జీఎస్టీ అదనమని వెల్లడించింది. ఒక్కో డోసుకు 996 రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించింది. స్థానికంగా ఉత్పత్తి ప్రారంభిస్తే వీటి ధర మరింత తగ్గుతుందని పేర్కొంది. దేశంలో.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇప్పుడు స్పుత్నిక్‌-వి అందుబాటులోకి వచ్చింది.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో.. ఆ మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండీ, కో-ఛైర్మన్ జీవీ ప్రసాద్ అన్నారు. భారత్​లో వ్యాక్సినేషన్ డ్రైవ్​కు సహకరించడమే ప్రస్తుతం మా లక్ష్యమని తెలిపారు.

ఇదీ చదవండి 'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

దేశంలో టీకా పంపిణీ వేగవంతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ.. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చింది. మాస్కో నుంచి ఈనెల 1నే స్పుత్నిక్-వి టీకా డోసులు హైదరాబాద్‌ చేరుకోగా...కౌసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ అనుమతితో ఇవాళ మొదటి డోసు ఇచ్చినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ సహా మరో నాలుగు సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. స్పుత్నిక్-వి ఒక్కో డోసు ధర 948 రూపాయలుగా నిర్ణయించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఈ ధరకు 5శాతం జీఎస్టీ అదనమని వెల్లడించింది. ఒక్కో డోసుకు 996 రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించింది. స్థానికంగా ఉత్పత్తి ప్రారంభిస్తే వీటి ధర మరింత తగ్గుతుందని పేర్కొంది. దేశంలో.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇప్పుడు స్పుత్నిక్‌-వి అందుబాటులోకి వచ్చింది.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో.. ఆ మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండీ, కో-ఛైర్మన్ జీవీ ప్రసాద్ అన్నారు. భారత్​లో వ్యాక్సినేషన్ డ్రైవ్​కు సహకరించడమే ప్రస్తుతం మా లక్ష్యమని తెలిపారు.

ఇదీ చదవండి 'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.