ETV Bharat / city

శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఇది అవాస్తవం!

తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారం చేస్తే చర్యలు తప్పవని దేవస్థాన సమాచార విభాగం హెచ్చరించింది.

author img

By

Published : Apr 29, 2020, 11:38 PM IST

the-campaign-on-the-suspension-of-srivari-darshan-is-unreal
శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఇది అవాస్తవం!

తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై తితిదే స్పందించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంపై ధర్మకర్తల మండలి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థాన సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై తితిదే స్పందించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంపై ధర్మకర్తల మండలి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థాన సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవీ చూడండి: తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.