ETV Bharat / city

JUDA's Strike: ముగిసిన చర్చలు.. సమ్మె విరమణపై సాయంత్రం నిర్ణయం

author img

By

Published : May 27, 2021, 12:37 PM IST

Updated : May 27, 2021, 3:03 PM IST

telangana judas meeting with Health Secretary rijvi
telangana judas meeting with Health Secretary rijvi

14:04 May 27

స్పష్టమైన హామీ లభించలేదన్న జూడాలు

స్పష్టమైన హామీ లభించలేదన్న జూడాలు

జూనియర్‌ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకున్న జూడాలకు స్పష్టమైన హామీ లభించలేదని జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ లిఖితపూర్వక హామీ ఇవ్వలేదని జూనియర్ వైద్యులు తెలిపారు. 

"కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. అత్యవసర సేవలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్స్​గ్రేషియా విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించమన్నారు."- జూడాలు

సమ్మె విరమణపై సాయంత్రం అందరితో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. 

12:17 May 27

జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభం

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. బీఆర్‌కే భవన్‌లో రిజ్వీతో సమావేశమైన ఐదుగురు సభ్యుల బృందం చర్చిస్తోంది. జూడాలు తమ డిమాండ్లను రిజ్వీకి వివరిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు నిర్వహించిన చర్చలు విఫలం కాగా... ప్రస్తుత చర్చలు ఫలిస్తాయా.. లేదా..? అన్న ఆసక్తి నెలకొంది.

రిజ్వీతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరవేరటమే లక్ష్యంగా జూడాలు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించిన జూడాలు... నేడు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేశారు.

ఇదీ చూడండి: లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు

14:04 May 27

స్పష్టమైన హామీ లభించలేదన్న జూడాలు

స్పష్టమైన హామీ లభించలేదన్న జూడాలు

జూనియర్‌ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకున్న జూడాలకు స్పష్టమైన హామీ లభించలేదని జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ లిఖితపూర్వక హామీ ఇవ్వలేదని జూనియర్ వైద్యులు తెలిపారు. 

"కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. అత్యవసర సేవలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్స్​గ్రేషియా విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించమన్నారు."- జూడాలు

సమ్మె విరమణపై సాయంత్రం అందరితో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. 

12:17 May 27

జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభం

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. బీఆర్‌కే భవన్‌లో రిజ్వీతో సమావేశమైన ఐదుగురు సభ్యుల బృందం చర్చిస్తోంది. జూడాలు తమ డిమాండ్లను రిజ్వీకి వివరిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు నిర్వహించిన చర్చలు విఫలం కాగా... ప్రస్తుత చర్చలు ఫలిస్తాయా.. లేదా..? అన్న ఆసక్తి నెలకొంది.

రిజ్వీతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరవేరటమే లక్ష్యంగా జూడాలు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించిన జూడాలు... నేడు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేశారు.

ఇదీ చూడండి: లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు

Last Updated : May 27, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.