ETV Bharat / city

'వేతన కోత తాత్కాలికమే.. సర్దుబాటు చేస్తాం'

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1500కోట్ల మేర సర్దుబాటు కానున్నాయి. గౌరవవేతనం పొందే హోంగార్డులు, విద్యావాలంటీర్లు, అంగన్​వాడీ కార్యకర్తలు, వీఆర్ఓలకు కూడా కోత వర్తిస్తుందని సర్కార్ స్పష్టం చేసింది. కోత తాత్కాలికమేనని, తర్వాత సర్దుబాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

author img

By

Published : Apr 1, 2020, 10:14 AM IST

corona
corona

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం కోత విధించిన సర్కార్... అఖిల భారతసర్వీసు అధికారులకు 60శాతం, మిగతా వారికి 50శాతం కోత విధించింది. నాల్గో తరగతి ఉద్యోగులకు మాత్రం పది శాతం కోత విధించింది. ఫించనుదార్లకూ ఇదే తరహాలో కోత వర్తించనుంది.

కోత అందరికి

కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బిల్లులు జారీ చేసిన వేతనాలకు సంబంధించి కూడా కోత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తరహాలోనే గౌరవవేతనాలు పొందే హోంగార్డులు, అంగన్ వాడీ కార్యకర్తలు, వీఆర్ఓలు, విద్యావాలంటీర్లకు పది శాతం కోత వర్తిస్తుందని తెలిపింది. అన్ని శాఖల ఉద్యోగులకు కోత వర్తిస్తుందని... ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

మెరుగైతే ఇస్తాం

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా రూ.3000కోట్ల వరకు చెల్లిస్తుంటారు. నాల్గో తరగతి మినహా మిగతా ఉద్యోగులందరికీ 50 శాతం, అఖిల భారత సర్వీసు అధికారులకు 60శాతం కోత విధించిన నేపథ్యంలో ఈ భారం సగం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.1500 కోట్ల చెల్లింపులు తగ్గుతాయని అంటున్నారు. కోత కేవలం తాత్కాలికం మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చెప్తున్నారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాక కోత విధించిన మొత్తాలను సర్దుబాటు చేస్తారని అంటున్నారు.

ఇదీ చూడండి: 'సాయంగా భావించండి.. కుదుటపడ్డాక పూర్తి జీతం ఇస్తాం'

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం కోత విధించిన సర్కార్... అఖిల భారతసర్వీసు అధికారులకు 60శాతం, మిగతా వారికి 50శాతం కోత విధించింది. నాల్గో తరగతి ఉద్యోగులకు మాత్రం పది శాతం కోత విధించింది. ఫించనుదార్లకూ ఇదే తరహాలో కోత వర్తించనుంది.

కోత అందరికి

కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బిల్లులు జారీ చేసిన వేతనాలకు సంబంధించి కూడా కోత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తరహాలోనే గౌరవవేతనాలు పొందే హోంగార్డులు, అంగన్ వాడీ కార్యకర్తలు, వీఆర్ఓలు, విద్యావాలంటీర్లకు పది శాతం కోత వర్తిస్తుందని తెలిపింది. అన్ని శాఖల ఉద్యోగులకు కోత వర్తిస్తుందని... ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

మెరుగైతే ఇస్తాం

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా రూ.3000కోట్ల వరకు చెల్లిస్తుంటారు. నాల్గో తరగతి మినహా మిగతా ఉద్యోగులందరికీ 50 శాతం, అఖిల భారత సర్వీసు అధికారులకు 60శాతం కోత విధించిన నేపథ్యంలో ఈ భారం సగం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.1500 కోట్ల చెల్లింపులు తగ్గుతాయని అంటున్నారు. కోత కేవలం తాత్కాలికం మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చెప్తున్నారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాక కోత విధించిన మొత్తాలను సర్దుబాటు చేస్తారని అంటున్నారు.

ఇదీ చూడండి: 'సాయంగా భావించండి.. కుదుటపడ్డాక పూర్తి జీతం ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.