ETV Bharat / city

లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీజీపీ

author img

By

Published : Mar 23, 2020, 1:12 PM IST

Updated : Mar 23, 2020, 1:24 PM IST

కరోనా తీవ్రతను గుర్తించి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్లపై తిరిగేందుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. సమీపంలోని కిరాణా, కూరగాయల దుకాణాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామన్నారు. వాహనాలపై దూరప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు.

telangana-dgp-talks
telangaలాక్‌డౌన్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీజీపీna-dgp-talks

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి వచ్చిందని అన్నారు. చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉందని వివరించారు. రాత్రి 7 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులకు అనుమతి ఉంటుందని తెలిపారు.

లాక్‌డౌన్‌ అమలుపై పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాం. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. రోడ్లపైకి వచ్చేందుకు ఆటోలు, ట్యాక్సీలకు కూడా అనుమతి లేదు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తాం. మన భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేస్తాం. లాక్‌డౌన్‌ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.

- డీజీపీ మహేందర్ రెడ్డి

లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీజీపీ

ఇదీ చూడండి: వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు : సీఎస్​

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి వచ్చిందని అన్నారు. చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉందని వివరించారు. రాత్రి 7 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులకు అనుమతి ఉంటుందని తెలిపారు.

లాక్‌డౌన్‌ అమలుపై పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాం. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. రోడ్లపైకి వచ్చేందుకు ఆటోలు, ట్యాక్సీలకు కూడా అనుమతి లేదు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తాం. మన భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేస్తాం. లాక్‌డౌన్‌ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.

- డీజీపీ మహేందర్ రెడ్డి

లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీజీపీ

ఇదీ చూడండి: వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు : సీఎస్​

Last Updated : Mar 23, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.