ఏపీలోని శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారు పర్వదినాల్లో బంగారు ఆభరణాల అలంకరణతో దర్శనమివ్వనున్నారు. కార్తీక ఏకాదశి నాడు బంగారు ఆభరణాలు ధరింపచేయటం ఆనవాయితి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా 2008 రథసప్తమి తర్వాత ఇప్పటివరకు సూర్య భగవానుడిని వెండి నగలతోనే అలంకరిస్తున్నారు.
ఇకపై పర్వదినాల్లో మూలవిరాట్టుకు బంగారు ఆభరణాలతో అలంకరణ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని దేవాలయం ఈవో తెలిపారు. దీంతో 12 ఏళ్ల తర్వాత.. ఈనెల 25, 26న సూర్యభగవానుడు స్వర్ణాభరణాలతో భక్తులకు కనులవిందు చేయనున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : శోభాయమానం.. పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం