ETV Bharat / city

'పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?'

author img

By

Published : Oct 5, 2020, 2:06 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

students protest against b.tech exams during corona pandemic
జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన

ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. పరీక్షలు నిర్వహిస్తామంటూ తెలంగాణ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతోందని ఎన్​ఎస్​యూఐ ఆరోపించింది. బీటెక్ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. 50 శాతం ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

వారిని అడ్డుకున్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకపోవడం వల్ల అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది.

ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. పరీక్షలు నిర్వహిస్తామంటూ తెలంగాణ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతోందని ఎన్​ఎస్​యూఐ ఆరోపించింది. బీటెక్ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. 50 శాతం ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

వారిని అడ్డుకున్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకపోవడం వల్ల అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.