ETV Bharat / city

పోలీసుల గొప్ప మససు... అవ్వకు మంచి ఇల్లు కట్టించారు...

నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో నిమగ్నం... కరోనా నియంత్రణలో ముందుడి సేవలు... ఇలా విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్న పోలీసులు తమ మంచి మనుసును కూడా చాటుకుంటున్నారు. ఎవరూ లేక ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి మంచి ఇల్లుతో పాటు సకల సౌకర్యాలు కల్పించారు. కన్న కొడుకుల్లా పోలీసులు చేసిన గొప్ప పని చూసి ఆ అవ్వ ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.

author img

By

Published : Aug 29, 2020, 10:21 AM IST

saifabad police built house to lodage women
saifabad police built house to lodage women

కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్​లో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. పోలీసుల సాయంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి కొన్ని ఇళ్ళు గుర్తించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఖైరతాబాద్‌ డివిజన్‌లోని తుమ్మలబస్తీలో నాలా పక్కన ఓ ఇంటి గోడ కూలిపోయి ఉండటం గమనించారు. అక్కడకు వెళ్లిన సిబ్బందికి లోపల ఓ వృద్ధురాలు కనిపించింది. లేవలేని స్థితిలో ఆమెను చూసి చలించిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సకలసౌకర్యాలతో...

వృద్ధురాలి వివరాలు సేకరించి యాదమ్మగా గుర్తించారు. సైఫాబాద్ పోలీస్టేషన్​లో డిటెక్టివ్ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న రాజు నాయక్ యాదమ్మకు ఇల్లు కట్టించి ఇవ్వాలని తలిచారు. ఇల్లు నిర్మించినంత కాలం బుద్వేల్​లోని తనకు తెలిసిన థామస్‌ వృద్ధాశ్రమానికి యాదమ్మను తరలించారు. తన సొంత ఖర్చులతో వృద్ధురాలి ఇంటిని తిరిగి నిర్మించారు. ఇందుకు స్టేషన్​లోని ఎస్సైలు సైతం తోడవగా... అన్ని సౌకర్యాలు సమకూరాయి. యాదమ్మకు ఇక ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయించారు. పడుకోవడాని మంచం, పరుపు, గదిలో ఫ్యాను, లైట్లు ఏర్పాటు చేశారు.

చనిపోయిన నానమ్మ గుర్తొచ్చి...

తాను చేస్తున్న సాయాన్ని ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని రాజు నాయక్‌.. ఇల్లు కట్టించే వరకు విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. తోటి సిబ్బంది ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా... గొప్ప మనసు చాటుకున్న డీఐని అభినందించారు. యాదమ్మను చూస్తే చనిపోయిన తన నానమ్మ గుర్తొచ్చిందని... దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఇతరులకు సాయపడటం మన బాధ్యత అని డీఐ రాజు నాయక్ తెలిపారు.

కన్న కొడుకుల్లా....

సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్​ ఆధ్వర్యంలో యాదమ్మతో గృహప్రవేశం చేయించారు. ఆ ఇల్లు చూసిన యాదమ్మ ఆనందానికి అవదుల్లేవు. కన్న కొడుకులా ఇల్లు నిర్మించాడని.. ఆనంద బాష్పాలతో ఆ అవ్వ రాజునాయక్​కు కృతజ్ఞత చెప్పుకుంది.

అవ్వకు గొప్ప మేలు...

పదిహేనేళ్ల కిందట ఓ ప్రమాదంలో యాదమ్మ భర్త మరణించగా... పలు ఇళ్లల్లో పనిచేస్తూ చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తోంది. ఆమె పరిస్థితి చూసి చలించి ఇంటికి ఎదురుగా నివసించే కల్యాణి అనే యువతి సపర్యలు చేయటమే కాకుండా భోజన వసతులు సైతం కల్పిస్తోంది. యాదమ్మకు పోలీసులు చేసిన మేలు చాలా గొప్పదని... స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్​లో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. పోలీసుల సాయంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి కొన్ని ఇళ్ళు గుర్తించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఖైరతాబాద్‌ డివిజన్‌లోని తుమ్మలబస్తీలో నాలా పక్కన ఓ ఇంటి గోడ కూలిపోయి ఉండటం గమనించారు. అక్కడకు వెళ్లిన సిబ్బందికి లోపల ఓ వృద్ధురాలు కనిపించింది. లేవలేని స్థితిలో ఆమెను చూసి చలించిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సకలసౌకర్యాలతో...

వృద్ధురాలి వివరాలు సేకరించి యాదమ్మగా గుర్తించారు. సైఫాబాద్ పోలీస్టేషన్​లో డిటెక్టివ్ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న రాజు నాయక్ యాదమ్మకు ఇల్లు కట్టించి ఇవ్వాలని తలిచారు. ఇల్లు నిర్మించినంత కాలం బుద్వేల్​లోని తనకు తెలిసిన థామస్‌ వృద్ధాశ్రమానికి యాదమ్మను తరలించారు. తన సొంత ఖర్చులతో వృద్ధురాలి ఇంటిని తిరిగి నిర్మించారు. ఇందుకు స్టేషన్​లోని ఎస్సైలు సైతం తోడవగా... అన్ని సౌకర్యాలు సమకూరాయి. యాదమ్మకు ఇక ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయించారు. పడుకోవడాని మంచం, పరుపు, గదిలో ఫ్యాను, లైట్లు ఏర్పాటు చేశారు.

చనిపోయిన నానమ్మ గుర్తొచ్చి...

తాను చేస్తున్న సాయాన్ని ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని రాజు నాయక్‌.. ఇల్లు కట్టించే వరకు విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. తోటి సిబ్బంది ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా... గొప్ప మనసు చాటుకున్న డీఐని అభినందించారు. యాదమ్మను చూస్తే చనిపోయిన తన నానమ్మ గుర్తొచ్చిందని... దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఇతరులకు సాయపడటం మన బాధ్యత అని డీఐ రాజు నాయక్ తెలిపారు.

కన్న కొడుకుల్లా....

సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్​ ఆధ్వర్యంలో యాదమ్మతో గృహప్రవేశం చేయించారు. ఆ ఇల్లు చూసిన యాదమ్మ ఆనందానికి అవదుల్లేవు. కన్న కొడుకులా ఇల్లు నిర్మించాడని.. ఆనంద బాష్పాలతో ఆ అవ్వ రాజునాయక్​కు కృతజ్ఞత చెప్పుకుంది.

అవ్వకు గొప్ప మేలు...

పదిహేనేళ్ల కిందట ఓ ప్రమాదంలో యాదమ్మ భర్త మరణించగా... పలు ఇళ్లల్లో పనిచేస్తూ చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తోంది. ఆమె పరిస్థితి చూసి చలించి ఇంటికి ఎదురుగా నివసించే కల్యాణి అనే యువతి సపర్యలు చేయటమే కాకుండా భోజన వసతులు సైతం కల్పిస్తోంది. యాదమ్మకు పోలీసులు చేసిన మేలు చాలా గొప్పదని... స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.