తెలంగాణ ట్రాన్స్కో జేఎండీ (ఫైనాన్స్)గా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి సి.శ్రీనివాసరావు నియామకమయ్యారు. మూడేళ్ల పాటు సి.శ్రీనివాసరావు బాధ్యతల్లో కొనసాగుతారని ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ట్రాన్స్కోలో ఇంఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు... ఇంఛార్జ్ జేఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం.. కేంద్ర సర్వీసుకు రాజీనామా చేసి పూర్తిస్థాయిలో జేఎండీ బాధ్యతలు చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు.