ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో 8 నెలల గర్భిణీ నేలపై పడి చనిపోయి మూడు గంటలు దాటినా ఎవ్వరూ స్పందించక పోవటం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించారని.. ఆ దృశ్యాలు తనను ఎంతో కలచి వేశాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గర్భిణీ వాంతులు చేసుకుని చనిపోయిందని, ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదంటూ... తోటి రోగులు బాధపడుతూ ఈ వీడియో పెట్టారన్నారు. ఈ దృశ్యాలు ఎంతో భయంకరంగా, దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.
![గర్భిణీ నేలపై పడి చనిపోయినా పట్టించుకునే వారే లేరు: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8129110_babu.jpg)