ETV Bharat / city

పుర ఎన్నికలకు పోలీసుల పటిష్ఠ భద్రత - పుర ఎన్నికలకు పోలీసుల పటిష్ఠ భద్రత

పురపాలక ఎన్నికల కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురపాలక ఎన్నికలు జరుగుతున్న చోట్ల 50వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

పుర ఎన్నికలకు పోలీసుల పటిష్ఠ భద్రత
పుర ఎన్నికలకు పోలీసుల పటిష్ఠ భద్రత
author img

By

Published : Jan 22, 2020, 6:13 AM IST


పుర ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పురపాలక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 50వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక పోలీసులతో పాటు... ఎక్సైజ్, అటవీశాఖకు చెందిన సిబ్బంది కూడా బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు... సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై ఇప్పటికే 131 కేసులు నమోదు చేశారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా పెట్టారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిపై అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌ కలిగిన 1745 ఆయుధాలను ఠాణాల్లో డిపాజిట్ చేయించుకున్నారు.

ఓటర్లు కాకుండా ఇతర అభ్యర్థులెవరైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. వెంటనే ఇతర పోలీసు బలగాలు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.

శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు నిర్భయంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీచూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్


పుర ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పురపాలక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 50వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక పోలీసులతో పాటు... ఎక్సైజ్, అటవీశాఖకు చెందిన సిబ్బంది కూడా బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు... సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై ఇప్పటికే 131 కేసులు నమోదు చేశారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా పెట్టారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిపై అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌ కలిగిన 1745 ఆయుధాలను ఠాణాల్లో డిపాజిట్ చేయించుకున్నారు.

ఓటర్లు కాకుండా ఇతర అభ్యర్థులెవరైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. వెంటనే ఇతర పోలీసు బలగాలు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.

శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు నిర్భయంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీచూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్

TG_HYD_03_22_POLICE_MUNCIPAL_ARRANGEMENTS_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) పురపాలక ఎన్నికల కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురపాలక ఎన్నికలు జరుగుతున్న చోట్ల 50వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.....LOOK V.O- పురపాలక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పురపాలక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 50వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక పోలీసులతో పాటు... ఎక్సైజ్, అటవీశాఖకు చెందిన సిబ్బంది కూడా బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు... సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై ఇప్పటికే 131 కేసులు నమోదు చేశారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా పెట్టారు. v.o- తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 1122 కేసులు నమోదు చేసి 4969మందిపై అదుపులోకి తీసుకున్నారు. లైసెన్ కలిగిన 1745 ఆయుధాలను ఠాణాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోలేదు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బయటి వ్యక్తులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లు కాకుండా ఇతర అభ్యర్థులెవరైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఏమైనా ఇబ్బందులు తలెత్తుతే.. వెంటనే ఇతర పోలీసు బలగాలు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు... కింది స్థాయి సిబ్బందికి సలహాలు ఇస్తున్నారు. ఒక్కో పురపాలకానికి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారిని బాధ్యుడిగా నియమించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. E.V.O- శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు నిర్భయంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.