ETV Bharat / city

AP Police: ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ సభ్యుల నియామకం

author img

By

Published : Jul 9, 2021, 12:00 PM IST

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ మేరకు జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్​లు, సభ్యులు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

police complaints authority
ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సభ్యులను నియమించింది. ఈ మేరకు ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సంస్థకు ఛైర్మన్​గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్​ను ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర స్థాయి అథారిటీకి సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.వి.వి. గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాలవ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్​లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మూడేసి జిల్లాలకు ఒక ఛైర్మన్​, ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు విశ్రాంత జిల్లా అదనపు న్యాయమూర్తి అనింగి వరప్రసాద రావును ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది.

జిల్లాలకు..

ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు విశ్రాంత జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథం నియామకం కాగా.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు విశ్రాంత అదనపు జిల్లా న్యాయమూర్తి నేతల రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కుప్పం వెంకట రమణా రెడ్డి నియామకం అయ్యారు. జిల్లాల కమిటీల సభ్యులుగా విశ్రాంత డీఎస్పీలు, విశ్రాంత పాలనాధికారులను ప్రభుత్వం నియమించింది.

ఇవీ చదవండి: HARITHA HARAM: మీరు నాటేస్తే.. మేం వేటేస్తాం!

FOOD ZONE: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు భూ సేకరణ పూర్తి

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సభ్యులను నియమించింది. ఈ మేరకు ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సంస్థకు ఛైర్మన్​గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్​ను ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర స్థాయి అథారిటీకి సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.వి.వి. గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాలవ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్​లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మూడేసి జిల్లాలకు ఒక ఛైర్మన్​, ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు విశ్రాంత జిల్లా అదనపు న్యాయమూర్తి అనింగి వరప్రసాద రావును ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది.

జిల్లాలకు..

ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు విశ్రాంత జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథం నియామకం కాగా.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు విశ్రాంత అదనపు జిల్లా న్యాయమూర్తి నేతల రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కుప్పం వెంకట రమణా రెడ్డి నియామకం అయ్యారు. జిల్లాల కమిటీల సభ్యులుగా విశ్రాంత డీఎస్పీలు, విశ్రాంత పాలనాధికారులను ప్రభుత్వం నియమించింది.

ఇవీ చదవండి: HARITHA HARAM: మీరు నాటేస్తే.. మేం వేటేస్తాం!

FOOD ZONE: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు భూ సేకరణ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.