లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాల ఏర్పాటు, భోజన వసతి కల్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. గాంధీభవన్లో కొవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఉత్తమ్.. పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
ఇప్పటివరకు నేతలు, కార్యకర్తలు పేదలకు చేసిన సేవా కార్యక్రమాలతో ఓ నివేదిక సిద్ధం చేయాలన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో పేదలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కరోనాను అడ్డం పెట్టుకుని మోదీ సర్కార్ అన్నిరంగాలను ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు!