ETV Bharat / city

పరీక్షల్లో పారదర్శకత లేదు.. కేంద్ర బృందానికి రేవంత్​ లేఖ

author img

By

Published : Jun 29, 2020, 5:51 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలలో పారదర్శకత లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మొత్తం అనిశ్చితిలో ఉందని పరీక్ష రేటును మెరుగుపర్చాలని ఐసీఎంఆర్‌ పదేపదే చెప్పినా ఎప్పుడూ సరిదిద్దలేని ఆక్షేపించారు.ఈ మేరకు కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చిన లవ్‌ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

MP Revanth Reddy Letter To Central Covid Team
కరోనా పరిస్థితిపై.. కేంద్ర బృందానికి ఎంపీ రేవంత్​ రెడ్డి లేఖ

రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితిని ఆ బృందానికి రాష్ట్ర కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​ రెడ్డి లేఖలో వివరించారు. జూన్ 23నాటికి కొవిడ్-19 పాజిటివ్‌ రేటు 32.1 శాతం ఉందని ఇది దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధికమన్నారు. ట్రూనాట్ యంత్రాల కొరత ఉందని.. పొరుగు రాష్ట్రం ఏపీలో 44 ట్రూనాట్​ యంత్రాలుండగా తెలంగాణలో కేవలం 22 యంత్రాలు మాత్రమే ఉన్నాయని లేఖలో తెలిపారు. పరీక్ష కోసం ఒకే ఒక కేంద్ర ప్రయోగశాల మాత్రమే ఉన్నదని.. ఈ జనాభాకు ఇది సరిపోదని రేవంత్ రెడ్డి వివరించారు. టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​) ఆస్పత్రిని నడపడానికి అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది లేనందున టిమ్స్ నామమాత్రంగా నడుస్తుందన్నారు. పార్లమెంట్ కోటా నుంచి నిధులు కేటాయించినా ఇప్పటి వరకు ఉపయోగించలేదని కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు.

గాంధీ ఆస్పత్రి మాత్రమే ప్రభుత్వ అనుమతి పొందిన చికిత్సా కేంద్రంగా గుర్తించబడిందని, అక్కడ కూడా సరైన మందులు, పారిశుధ్యం, పరిశుభ్రత,కొవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స చేయడంలో జాగ్రత్తలు లేవని ఏకరువు పెట్టారు. ఆసుపత్రిని నడపడానికి 1200 మంది సిబ్బంది అవసరం, కానీ వాస్తవంగా 400 మాత్రమే సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితి అక్కడ పనిచేసే ప్రతి సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి మోపుతుందన్నారు.

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, వైరస్‌తో పోరాడటానికి అవసరమైన పరికరాలు లేనందుకు వైద్యులే నిరసన వ్యక్తం చేశారని, ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని కేంద్ర బృందానికి తెలిపారు. ఇటీవల మనోజ్ అనే జర్నలిస్ట్ చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు, అతను చికిత్స సమయంలో కనీసం నీరు కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టులు ధర్నా కూడా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు 50 లక్షల బీమా ఉంది. జర్నలిస్టులు రిస్క్​ తీసుకొని విధులు నిర్వహిస్తున్నందున వారిని కూడా ఫ్రంట్​లైన్​ కార్మికుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత భయంకర పరిస్థితులలో మహమ్మారి సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అంటువ్యాధిని అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితిని ఆ బృందానికి రాష్ట్ర కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​ రెడ్డి లేఖలో వివరించారు. జూన్ 23నాటికి కొవిడ్-19 పాజిటివ్‌ రేటు 32.1 శాతం ఉందని ఇది దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధికమన్నారు. ట్రూనాట్ యంత్రాల కొరత ఉందని.. పొరుగు రాష్ట్రం ఏపీలో 44 ట్రూనాట్​ యంత్రాలుండగా తెలంగాణలో కేవలం 22 యంత్రాలు మాత్రమే ఉన్నాయని లేఖలో తెలిపారు. పరీక్ష కోసం ఒకే ఒక కేంద్ర ప్రయోగశాల మాత్రమే ఉన్నదని.. ఈ జనాభాకు ఇది సరిపోదని రేవంత్ రెడ్డి వివరించారు. టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​) ఆస్పత్రిని నడపడానికి అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది లేనందున టిమ్స్ నామమాత్రంగా నడుస్తుందన్నారు. పార్లమెంట్ కోటా నుంచి నిధులు కేటాయించినా ఇప్పటి వరకు ఉపయోగించలేదని కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు.

గాంధీ ఆస్పత్రి మాత్రమే ప్రభుత్వ అనుమతి పొందిన చికిత్సా కేంద్రంగా గుర్తించబడిందని, అక్కడ కూడా సరైన మందులు, పారిశుధ్యం, పరిశుభ్రత,కొవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స చేయడంలో జాగ్రత్తలు లేవని ఏకరువు పెట్టారు. ఆసుపత్రిని నడపడానికి 1200 మంది సిబ్బంది అవసరం, కానీ వాస్తవంగా 400 మాత్రమే సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితి అక్కడ పనిచేసే ప్రతి సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి మోపుతుందన్నారు.

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, వైరస్‌తో పోరాడటానికి అవసరమైన పరికరాలు లేనందుకు వైద్యులే నిరసన వ్యక్తం చేశారని, ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని కేంద్ర బృందానికి తెలిపారు. ఇటీవల మనోజ్ అనే జర్నలిస్ట్ చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు, అతను చికిత్స సమయంలో కనీసం నీరు కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టులు ధర్నా కూడా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు 50 లక్షల బీమా ఉంది. జర్నలిస్టులు రిస్క్​ తీసుకొని విధులు నిర్వహిస్తున్నందున వారిని కూడా ఫ్రంట్​లైన్​ కార్మికుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత భయంకర పరిస్థితులలో మహమ్మారి సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అంటువ్యాధిని అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.