ETV Bharat / city

గవర్నర్​ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటు స్పందన ​.. ఏమన్నారంటే..?

author img

By

Published : Apr 8, 2022, 7:31 PM IST

Sayavathi Ratod Comments On Governor: గవర్నర్ తమిళి సై దిల్లీలో రాష్ట్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు. గవర్నర్‌ తమిళిసై భాజపా నాయకురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

minister-satyavathi-ratod-responded-on-governor-statements-on-trs-government
minister-satyavathi-ratod-responded-on-governor-statements-on-trs-government

Sayavathi Ratod Comments On Governor: దిల్లీలో గవర్నర్​ తమిళిసై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్​ స్పందించగా.. మహిళా మంత్రి సత్యవతి రాఠోడ్​ ఘాటుగానే స్పందించారు. గవర్నర్​ వ్యాఖ్యలు చూస్తూంటే.. ఆమె మనసులో ఏముందో అర్థమవుతోందని.. తాను ఓ భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖానించారు. సీఎం కేసీఆర్​కు మహిళలు అంటే గౌరవమని... అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి ఆయనకుందని మంత్రి వివరించారు. కలవాల్సిన వారిని కలవకుండా భాజపా వారిని కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.

"నేను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్​ అనడం సబబు కాదు. ఆమె మాటల్లోని ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలకు అంత అర్థం అయింది. ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పాల్సింది. కానీ ప్రధానమంత్రి, హోంమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంను బెదిరించినట్టు మాట్లాడారు. ఆమె ఆరోపణలు విన్నాక.. ఒక గవర్నర్​గా కాకుండా భాజపా కార్యకర్తగా మాట్లాడినట్టు అనిపిస్తోంది. 119 స్థానాలకు గానూ వందపై చిలుకు తెరాస ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కులుస్తామంటున్న గవర్నర్​.. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే గతి పడుతుంది." - సత్యవతి రాఠోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

గవర్నర్​ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటు స్పందన ​.. ఏమన్నారంటే..?

సంబంధిత కథనాలు:

Sayavathi Ratod Comments On Governor: దిల్లీలో గవర్నర్​ తమిళిసై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్​ స్పందించగా.. మహిళా మంత్రి సత్యవతి రాఠోడ్​ ఘాటుగానే స్పందించారు. గవర్నర్​ వ్యాఖ్యలు చూస్తూంటే.. ఆమె మనసులో ఏముందో అర్థమవుతోందని.. తాను ఓ భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖానించారు. సీఎం కేసీఆర్​కు మహిళలు అంటే గౌరవమని... అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి ఆయనకుందని మంత్రి వివరించారు. కలవాల్సిన వారిని కలవకుండా భాజపా వారిని కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.

"నేను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్​ అనడం సబబు కాదు. ఆమె మాటల్లోని ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలకు అంత అర్థం అయింది. ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పాల్సింది. కానీ ప్రధానమంత్రి, హోంమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంను బెదిరించినట్టు మాట్లాడారు. ఆమె ఆరోపణలు విన్నాక.. ఒక గవర్నర్​గా కాకుండా భాజపా కార్యకర్తగా మాట్లాడినట్టు అనిపిస్తోంది. 119 స్థానాలకు గానూ వందపై చిలుకు తెరాస ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కులుస్తామంటున్న గవర్నర్​.. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే గతి పడుతుంది." - సత్యవతి రాఠోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

గవర్నర్​ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటు స్పందన ​.. ఏమన్నారంటే..?

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.