ఏపీ అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతులు దూషించినా, కొట్టినా, తిట్టినా పట్టించుకోబోమన్నారు. అమరావతి నుంచి బ్యారేజ్, లింక్ రోడ్లు, బాహ్యవలయ రహదారి నిర్మిస్తామని వివరించారు.
తమ భూముల విలువ పెరగాలన్నదే అమరావతి రైతుల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. ఈ భూముల విలువ పెంచేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎన్వోసీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష