ETV Bharat / city

KTR:హైదరాబాద్​లో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుచేయండి: కేటీఆర్​ - హైదరాబాద్​లో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ కావాలన్న కేటీఆర్​

హైదరాబాద్​లోని జీనోమ్​ వ్యాలీలో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. ప్రతి బ్యాచ్​ని హిమాచల్​ప్రదేశ్​లోని కసౌలికి పంపడం వల్ల సమయం వృథా అవుతోందన్నారు. టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుకు అవసరమైన భూమిని అందిస్తామని వెల్లడించారు.

minister ktr request union government for vaccine testing center
ktr
author img

By

Published : Jun 20, 2021, 7:24 PM IST

హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ (vaccine testing center) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్​ కోరారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిన భాగ్యనగరంలో టెస్టింగ్ సెంటర్ అత్యవసరమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ టెస్టింగ్ సెంటర్‌కు.. ఇక్కడి సంస్థలు శాంపిల్స్​ పంపడం ద్వారా 45 రోజుల సమయం వృథా అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయవచ్చన్నారు. రానున్న 6 నెలల్లో నగరం నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న కేటీఆర్​... ఇలాంటి తరుణంలో ప్రతీ బ్యాచ్‌ని హిమాచల్​ప్రదేశ్​ కసౌలికి పంపడం ద్వారా ఉత్పత్తి తగ్గుతోందని వివరించారు.

వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని.. టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీనోమ్‌ వ్యాలీలో అందుకు అవసరమైన భూమిని అందిస్తామని వెల్లడించారు. ఫాస్ట్​ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.

ఇవీచూడండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా!

హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ (vaccine testing center) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్​ కోరారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిన భాగ్యనగరంలో టెస్టింగ్ సెంటర్ అత్యవసరమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ టెస్టింగ్ సెంటర్‌కు.. ఇక్కడి సంస్థలు శాంపిల్స్​ పంపడం ద్వారా 45 రోజుల సమయం వృథా అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయవచ్చన్నారు. రానున్న 6 నెలల్లో నగరం నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న కేటీఆర్​... ఇలాంటి తరుణంలో ప్రతీ బ్యాచ్‌ని హిమాచల్​ప్రదేశ్​ కసౌలికి పంపడం ద్వారా ఉత్పత్తి తగ్గుతోందని వివరించారు.

వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని.. టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీనోమ్‌ వ్యాలీలో అందుకు అవసరమైన భూమిని అందిస్తామని వెల్లడించారు. ఫాస్ట్​ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.

ఇవీచూడండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.