ETV Bharat / city

సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీ పెంపు: మంత్రి కొప్పుల

ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు ఆఖరు తేదీ నేటితో ముగుస్తుండగా.. దీనిని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు ఒక లక్షా 30వేల 104దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పలు ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు గడువు పెంచామన్నారు.

author img

By

Published : Jan 31, 2021, 3:01 PM IST

Minister Koppula Ishwar said that the last date for obtaining subsidized loans through SC Corporation has been extended to February 10
సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీ పెంపు: మంత్రి కొప్పుల

ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు దరఖాస్తు ఆఖరు తేదీని పొడిగిస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. రుణాలు పొందేందుకు ఆఖరు తేదీ నేటితో ముగుస్తుండగా.. దీనిని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచామని కొప్పుల వివరించారు.

1,30,104 దరఖాస్తులు:

ఇప్పటివరకు ఒక లక్షా 30వేల 104దరఖాస్తులు రాగా.. వీటిలో ఎక్కువ భాగం 94వేల 769 మంది హార్టికల్చర్, వ్యవసాయ రంగానికి.. 35వేల 335దరఖాస్తులు రవాణా రంగానికి సంబంధించినవని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 786కోట్ల రూపాయలు కేటాయించగా.. వీటిలో సబ్సిడీ కింద 500కోట్లు, 279కోట్లు బ్యాంకులు, 7కోట్లు లబ్ధిదారుల వాటా కింద ఉంటుందన్నారు.

నేరుగా రుణాలు:

ముఖ్యంగా ఎస్సీలలోని పేద రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ లైన్లు, కనెక్షన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల సహకారంతో ట్రాక్టర్లు, సరుకు రవాణా కోసం నాలుగు చక్రాల వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, మినీ డైరీ కింద గేదెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ కులాలలోని పేదలు, నిరుద్యోగ యువత సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈశ్వర్ కోరారు.

ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మార్కెట్‌.. మన్‌కీ బాత్‌లో ప్రశంసలు

ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు దరఖాస్తు ఆఖరు తేదీని పొడిగిస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. రుణాలు పొందేందుకు ఆఖరు తేదీ నేటితో ముగుస్తుండగా.. దీనిని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచామని కొప్పుల వివరించారు.

1,30,104 దరఖాస్తులు:

ఇప్పటివరకు ఒక లక్షా 30వేల 104దరఖాస్తులు రాగా.. వీటిలో ఎక్కువ భాగం 94వేల 769 మంది హార్టికల్చర్, వ్యవసాయ రంగానికి.. 35వేల 335దరఖాస్తులు రవాణా రంగానికి సంబంధించినవని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 786కోట్ల రూపాయలు కేటాయించగా.. వీటిలో సబ్సిడీ కింద 500కోట్లు, 279కోట్లు బ్యాంకులు, 7కోట్లు లబ్ధిదారుల వాటా కింద ఉంటుందన్నారు.

నేరుగా రుణాలు:

ముఖ్యంగా ఎస్సీలలోని పేద రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ లైన్లు, కనెక్షన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల సహకారంతో ట్రాక్టర్లు, సరుకు రవాణా కోసం నాలుగు చక్రాల వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, మినీ డైరీ కింద గేదెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ కులాలలోని పేదలు, నిరుద్యోగ యువత సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈశ్వర్ కోరారు.

ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మార్కెట్‌.. మన్‌కీ బాత్‌లో ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.