ETV Bharat / city

కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

author img

By

Published : Jun 3, 2020, 5:41 AM IST

కరోనా కట్టడికి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం లాక్​డౌన్ విధించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. తబ్లిగీ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్​ వ్యక్తులు పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడించారు. వారిలో 38 మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.

mim chief asaduddin owaisi comments on central governement about lockdown
కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

కొవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వలస కార్మికులు అష్టకష్టాలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత లాక్​డౌన్ ఎత్తేయడం ఏం వ్యూహమని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని విమర్శించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం లాక్​డౌన్ విధించిందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్యానించారు.

ఆరోపణలు అవాస్తవం

తబ్లిగీ నుంచి వచ్చిన కరోనా బాధితులు పూర్తి ఆరోగ్యవంతులయ్యారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. వారిలో 38 మంది... కరోనా సోకిన రోగులకు తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. రోజుకు ఆరుగురి చొప్పున ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. శాంపిల్స్ సేకరించేందుకు ఒక్కక్కరికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన వారితోనే కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందిందని ప్రచారం చేస్తున్న సంఘ్ పరివార్ ఆరోపణలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.

మతపెద్దలతో సమావేశం...
mim chief asaduddin owaisi comments on central governement about lockdown
కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

లాక్​డౌన్ 5.0 లో భాగంగా జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని మతాల పెద్దలతో ఓ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ సీఎం కార్యాలయం, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి అసద్ మద్దతిచ్చారు. రాష్ట్రాల హక్కులు హరించే ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.

కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

ఇదీ చూడండి:ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్​

కొవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వలస కార్మికులు అష్టకష్టాలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత లాక్​డౌన్ ఎత్తేయడం ఏం వ్యూహమని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని విమర్శించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం లాక్​డౌన్ విధించిందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్యానించారు.

ఆరోపణలు అవాస్తవం

తబ్లిగీ నుంచి వచ్చిన కరోనా బాధితులు పూర్తి ఆరోగ్యవంతులయ్యారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. వారిలో 38 మంది... కరోనా సోకిన రోగులకు తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. రోజుకు ఆరుగురి చొప్పున ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. శాంపిల్స్ సేకరించేందుకు ఒక్కక్కరికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన వారితోనే కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందిందని ప్రచారం చేస్తున్న సంఘ్ పరివార్ ఆరోపణలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.

మతపెద్దలతో సమావేశం...
mim chief asaduddin owaisi comments on central governement about lockdown
కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

లాక్​డౌన్ 5.0 లో భాగంగా జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని మతాల పెద్దలతో ఓ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ సీఎం కార్యాలయం, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి అసద్ మద్దతిచ్చారు. రాష్ట్రాల హక్కులు హరించే ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.

కేంద్రం విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు: ఓవైసీ

ఇదీ చూడండి:ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.