బుల్లెట్ బైక్ ఉంటే... కచ్చితంగా దానికి దడ్.. దడ్.. దడ్ మంటూ శబ్ధం వచ్చే సైలెన్సర్ను బిగిస్తుంటారు. అయితే అలాంటి శబ్ధంతో రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదాచారులు భయాందోళనలకు గురవుతున్నారంట. ఇందుకోసం ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు మహాంకాళి ట్రాఫిక్ సీఐ శంకర్ యాదవ్, ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలాంటి శబ్ధం చేసుకుంటూ వెళ్తున్న బుల్లెట్లను ఆపి కేసులు నమోదు చేస్తున్నారు.
సైలెన్సర్లు మార్చి డ్రైవ్ చేస్తున్న వాహనదారుల పొటోలు తీసి ఛలాన్లు పంపిస్తున్నారు. అలాంటి ఇబ్బందికరమైన సైలెన్సర్లు తొలగించాలని అవగాహన కల్పిస్తున్నట్టు సీఐ శంకర్ యాదవ్ తెలిపారు. జరిమానా చెల్లించి, సైనెన్సర్ తొలగిస్తేనే... బైకులు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎస్సై శంకర్ అన్నారు.
ఇదీ చూడండి: 125 గోవులను రక్షించిన యుగ తులసి ఫౌండేషన్