ETV Bharat / city

అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు: పోలీసులు

author img

By

Published : May 12, 2021, 3:00 PM IST

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలవుతోంది. దిల్‌సుఖ్​‌నగర్​లో లాక్​డౌన్​ అమలు తీరును జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్​, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావు పరిశీలించారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

హైదరాబాద్​లోని దిల్‌సుఖ్​‌నగర్​లో లాక్‌డౌన్‌ అమలు తీరును నగర జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్​‌, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావు పరిశీలించారు. రాజీవ్​ చౌక్‌ వద్ద వాహనాలను పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు.

సమయం మించిన తర్వాత రాకపోకలు కొనసాగించిన వాహనాలను నిలిపి వివరాలు సేకరించారు. వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేశారు. సరూర్‌నగర్, చైతన్యపురిలో కూడా లాక్‌డౌన్ అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చినా, అనుమతిలేని దుకాణాలను తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

హైదరాబాద్​లోని దిల్‌సుఖ్​‌నగర్​లో లాక్‌డౌన్‌ అమలు తీరును నగర జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్​‌, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావు పరిశీలించారు. రాజీవ్​ చౌక్‌ వద్ద వాహనాలను పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు.

సమయం మించిన తర్వాత రాకపోకలు కొనసాగించిన వాహనాలను నిలిపి వివరాలు సేకరించారు. వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేశారు. సరూర్‌నగర్, చైతన్యపురిలో కూడా లాక్‌డౌన్ అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చినా, అనుమతిలేని దుకాణాలను తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.