జీవిత బీమా సంస్థను పబ్లిక్ ఇష్యూకు పంపిస్తామని బడ్జెట్లో ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎల్ఐసీ క్లాస్-1 ఆఫీసర్స్ యూనియన్, ఆల్ ఇండియా ఎల్ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్లో సైఫాబాద్లోని జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి.
లాభాల్లో పయనిస్తున్న సంస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు తప్పుబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసీ వెన్నెముకలాంటిదన్నారు. రూ.32 లక్షల కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్న జీవిత బీమా సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 1.25 మంది ఉద్యోగులు, 11.91 మంది ఏజెంట్లు, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ అందరూ ఈ చర్యలను తిప్పకొట్టాలని కోరారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: 'డిపాజిటర్ల సొమ్ము భద్రం- బీమా కవరేజీ 5 లక్షలకు పెంపు'