ETV Bharat / city

"ఆర్టీసీకి పరిష్కారం చూపండి" ప్రధానికి కాంగ్రెస్​ ఎంపీల లేఖ

author img

By

Published : Nov 28, 2019, 10:54 PM IST

ఆర్టీసీ కార్మికుల ఆవేదనను.. రాష్ట్ర కాంగ్రెస్​ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్​ కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తున్నారని.. 49 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డునపడారని ప్రధాని మోదీకి లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకుని ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

letter-of-congress-mps-to-prime-minister-to-fix-the-rtc-problem
"ఆర్టీసీ సమస్య పరిష్కరించండి" ప్రధానికి కాంగ్రెస్​ ఎంపీల లేఖ


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లేఖ రాశారు. నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్‌ల సంతకాలతో ప్రధానికి లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం 49 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.

"ఆర్టీసీకి పరిష్కారం చూపండి" ప్రధానికి కాంగ్రెస్​ ఎంపీల లేఖ

వేలకోట్ల ఆస్తులు, విలువైన భూములున్నా.. అప్పులయ్యాయట..!
ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయని లేఖలో తెలిపారు. తెరాస ప్రభుత్వం కావాలనే ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీలు ఆరోపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము ఇవ్వకుండానే ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేసిందని వెల్లడించారు. యాభై రెండు రోజుల పాటు సమ్మె చేసిన కార్మికుల్లో దాదాపు 30మందికి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యారని, మరికొంత మంది మనో వేధనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని లేఖలో వివరించారు.

వారు చేశారు.. మీరెందుకు చేయరు..?
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగి ఉందని.. తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ!


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లేఖ రాశారు. నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్‌ల సంతకాలతో ప్రధానికి లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం 49 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.

"ఆర్టీసీకి పరిష్కారం చూపండి" ప్రధానికి కాంగ్రెస్​ ఎంపీల లేఖ

వేలకోట్ల ఆస్తులు, విలువైన భూములున్నా.. అప్పులయ్యాయట..!
ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయని లేఖలో తెలిపారు. తెరాస ప్రభుత్వం కావాలనే ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీలు ఆరోపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము ఇవ్వకుండానే ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేసిందని వెల్లడించారు. యాభై రెండు రోజుల పాటు సమ్మె చేసిన కార్మికుల్లో దాదాపు 30మందికి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యారని, మరికొంత మంది మనో వేధనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని లేఖలో వివరించారు.

వారు చేశారు.. మీరెందుకు చేయరు..?
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగి ఉందని.. తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ!

TG_Hyd_39_28_LETTER_TO_PRIMEMINISTER_AV_3038066 Reporter: M.Tirupal Reddy గమనిక: లెటర్‌ డెక్ వాట్సప్‌కు పంపించాను వాడుకోగలరు. () తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్నఅన్యాయంపై జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి మోదీకి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లేఖ రాశారు. నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్‌ల సంతకాలతో ప్రధానికి లేఖ పంపారు. 49 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్న ఎంపీలు వారిని రక్షించాల్సి ఉందన్నారు. దేశంలో అతిపెద్ద, సురక్షితమైన ప్రజా రవాణా సంస్థగా పేరున్న ఆర్టీసీ రాష్ట్ర విభజన సందర్బంగా ఆర్టీసీ కూడా రెండుగా విడిపోయిందని...ప్రస్తుతం 49 వేల మంది ఉద్యోగులతో నడుస్తున్నట్లు లేఖలో వివరించారు. ఈ సంస్థకు తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయని తెలిపారు. తెరాస ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము ఇవ్వకుండానే కావాలని ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేసిందని పేర్కొన్నారు. ఆర్టీసీ వాడుతున్న పెట్రోల్, డీజిల్ పైన దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా విలువ ఆధారిత పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. యాభై రెండు రోజులుపాటు సమ్మె చేసిన కార్మికులు దాదాపు 30మందికి గుండెపోటు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పక్కనున్న ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని ఇక్కడ విలీనం చేయకపోగా 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తున్నట్లు మంత్రి వర్గంలో తీర్మాణం చేసిన విషయాన్ని కూడా లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగి ఉందని పేర్కొన్న ఎంపీలు....తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.