ఏపీ విశాఖ జిల్లా అరకులోయ వరకు ప్రయాణించే కిరండూల్ రైలుకు ఈనెల 18 నుంచి మళ్లీ అద్దాల బోగీని పునరుద్ధరించనున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా బోగీని తొలగించామని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా పునరుద్ధరించున్నట్లు వివరించారు.
స్లీపర్ కోచ్, హాల్ట్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఎస్.కోట, బొర్రా గుహల్లో రైలును నిలుపుతామని పేర్కొన్నారు. పర్యటకులు కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్సింహా అరెస్టు